బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది.
Boris Johnson బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. ఏప్రిల్-25 భారత పర్యటనకు బోరిస్ జాన్సన్ రావాల్సి ఉండగా..ప్రస్తుతం భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఈ నెలాఖరులో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్గా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్…అప్పుడు బ్రిటన్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాయిదావేసుకున్నారు. దీంతో ఈ నెల చివరి వారంలో ఆయన భారత్లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది చివరిలో ఇరుదేశాల ప్రధానమంత్రులు సమావేశమై భారత్-బ్రిటన్ భవిష్యత్తు భాగస్వామ్యంపై చర్చిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.