50 దేశాల్లో ఎలక్షన్ : ఫేస్బుక్లో ఫేక్కు బ్రేక్!
సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఫేస్ బుక్ నిబంధనలకు స్ట్రిక్ట్ చేసింది. ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్ వేస్తోంది. దేశంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఫేస్ బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఫేస్ బుక్ నిబంధనలకు స్ట్రిక్ట్ చేసింది. ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్ వేస్తోంది. దేశంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఫేస్ బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
-
ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్
-
సోషల్ మీడియాలో ఫేస్ బుక్ కీలక పాత్ర
-
పొలిటికల్ యాడ్స్ పై కఠిన నిబంధనలు
-
లిబియా నియంత గడాఫీని గద్దె దించటంలో ఫేస్ బుక్ కీలక పాత్ర
ఢిల్లీ : సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఫేస్ బుక్ నిబంధనలకు స్ట్రిక్ట్ చేసింది. ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్ వేస్తోంది. దేశంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఫేస్ బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా భారత్, నైజీరియా, ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో రాజకీయ ప్రకటనలపై నిబంధనలు కఠినం చేసినట్లు ఫేస్బుక్ మేనేజ్ మెంట్ తెలిపింది. యాడ్స్ లో పొలిటికల్ జోక్యం అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 2019లో ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఫేస్బుక్ నియంత్రణ చర్యలు చేపట్టిన క్రమంలో పొలిటికల్ లీడర్స్ పలు ప్రకటనల కోసం ఫేస్బుక్ను ఉపయోగించుకోవడమే కాక ఫేక్ న్యూస్ వంటి టెలీకాస్ట్ లు ఎక్కువవుతున్నాయి. దీంతో ఎన్నికల నిబంధనలకు..కంపెనీ పాలసీలకు విరుద్ధంగా ఉంటుండటంతో ఫేస్బుక్ తగిన చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా అధికార వర్గాల నుంచి ఫేస్బుక్పై ఒత్తిళ్లు రావటంతో ఫేస్బుక్ 2018లో పొలిటిల్ యాడ్స్ పర్యవేక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో భారత్లో రాజకీయాల ప్రకటనలను సెర్చ్ చేయడానికి వీలైన ఆన్లైన్ లైబ్రరీలో ఉంచుతున్నామని..దీన్ని రాను రాను డెవలప్ చేసేందుకు యత్నిస్తున్నామని ఫేస్ బుక్ అధికారి తెలిపారు. నైజీరియాలో కూడా ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడ వెంటనే ఈ పాలసీ ప్రారంభిస్తున్నామని..ఉక్రెయిన్లో ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని తెలిపారు.నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానుండగా, ఉక్రెయిన్లో మార్చి 31 నుంచి జరగనున్నాయి.
అమెరికా, భారతదేశంలతోపాటు పలు దేశాల ప్రభుత్వాల నుంచి ఫేస్బుక్ యూజింగ్ పై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 2010లో అరబ్ దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తలెత్తిన అంతర్యుద్ధం విస్తరణకు కూడా ఫేస్ బుక్ ఒక కారణమన్న విమర్శ ఉన్న విషయం తెలిసిందే. (2011 లో లిబియా నియంత గడాఫీని గద్దె దించటంలో ఫేస్ బుక్ కీలక పాత్ర) ఇక అమెరికా ఎన్నికల్లో పేస్ బుక్ ద్వారా రష్యా జోక్యం చేసుకున్నదన్న వార్తలు, ఆరోపణలు సరేసరి. భారతదేశంలో లోక్ సభ ఎన్నికల వేళ అమలు చేయనున్న మార్గదర్శకాల ‘గైడ్’ విధాన నిర్ణేతలు, పార్లమెంట్ సభ్యులు, సీఎంలు, రాష్ట్రాల ఈసీలు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ‘ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ గైడ్ ఫర్ పొలిటీషియన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్’ అనే పేరుతో మార్గదర్శకాలు రూపొందించింది.