Burj Khalifa ‘Stay Strong India’ : ‘స్టే స్ట్రాంగ్ ఇండియా..బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం ప్రదర్శన

Burj Khalifa ‘Stay Strong India’ : ‘స్టే స్ట్రాంగ్ ఇండియా..బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం ప్రదర్శన

Burj Khalifa Lights Up 'stay Strong India' (1)

Burj Khalifa lights up ‘Stay Strong India’ : కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న భారత్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో మన భారత్ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించింది.

అంతేకాదు..‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశంతో సంఘీభావాన్ని ప్రదర్శించింది. బూర్జ్ ఖలీఫా భవనంపై మన భారత్ త్రివర్ణ పతాకం మెరిసిపోతూ కనువిందు చేసింది. చూపరులను ఎంతగానోఆకర్షించింది. ఇక అక్కడ ఉండే భారతీయులు ఒళ్లు పులకరించిపోయేలా మూడు రంగులతో ముచ్చటగొలుపుతూ కనిపించి కనువిందు చేసింది.

బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బుర్జ్ ఖలీఫా భవనంపై భారత పతాకాన్ని ప్రదర్శించి యూఏఈ సంఘీభావం తెలిపిందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. మరోవైపు, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా యూఏఈ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. కాగా గతం కంటే వేగంగా విస్తరించే ఈ రెండో విడత కరోనాను కూడా భారతీయులు సమర్థవంతంగా ఎదిరించాలని కోరుకుందాం..