చైనాలో మృత్యుహేళ : 724 మంది మృతి

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 09:04 AM IST
చైనాలో మృత్యుహేళ : 724 మంది మృతి

చైనాలో మృత్యుహేళ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మందిలో చనిపోతున్నారు. దీంతో పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారానికి మరణించిన వారి సంఖ్య…724కి చేరింది. ఒక్క ప్రావిన్స్‌లో 79 మంది చనిపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైరస్ బారిన పడిన వారు..34 వేల 872కి చేరింది. ఇందులో కొంతమంది కోలుకున్నట్లు..చైనా ప్రభుత్వం వెల్లడిస్తోంది. 

హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వూహాన్ ఇంకా దిగ్భందనంలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. భారత్‌తో సహా 25 దేశాల్లో ఈ వైరస్ పాకుతోంది. దీంతో పలు దేశాలు చైనాకు వెళ్లకుండా…ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే..దీనిపై WHO దీనిపై స్పందించింది. వైరస్ సోకిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలిపింది. 

అమెరికా ఆర్థిక సహాయం : 
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు.. అమెరికా ఆర్థిక సహాయం ప్రకటించింది. చైనాతో పాటు ఇతర ప్రభావిత దేశాలకు 100 మిలియన్ డాలర్లను సహాయాన్ని అందించనుంది అమెరికా. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు .. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. చైనాలో ఆరోగ్య పరిస్థితులు ట్రంప్‌కి వివరించారు. 

చైనాను ప్రశంసించిన ట్రంప్ : 
ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కట్టడికి చైనా చేస్తున్న పోరాటాన్ని .. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రశంసించారు. డ్రాగన్‌ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అమెరికాలో ఇప్పటివరకు  12 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రయాణాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. వైరస్‌పై పోరులో భాగంగా ప్రపంచస్థాయి నిపుణుల్ని పంపేందుకు అమెరికా ముందుకు  వచ్చిందని.. అక్కడి అధికారులు తెలిపారు.