బ్రేకింగ్ : బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్!!
బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అనంతరం బొల్సొనారో బ్రెజిల్కు తిరిగి రాగానే కమ్యూనికేషన్ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయటంతో పాజిటివ్ నిర్దారణ అయింది.
అయితే బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో, ఆయన కమ్యూనికేషన్ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి సమావేశంలో పాల్గొన్న క్రమంలో జెయిర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ విషయం సంచలనంగా మారింది. కాగా..ట్రంప్ కు కరోనా టెస్ట్ లు చేస్తామంటే ఆయన ఒప్పుకోని విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ట్రంప్ తో సమావేశం అనంతరం జెయిర్ బొల్సొనారోకు పాజిటివ్ రావవటం.. ఆ సమావేశంలో వీరు కాకుండా ఇంకా మిగిలిన ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయం తేలాల్సి ఉంది.
ఈ సమావేశంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో,ఫెడరల్ చట్టసభ సభ్యుడు అయిన బోల్సోనారో కుమారుడు ఎడ్వర్డో తదితరులు పాల్గొన్నారు. మరి వీరికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయోలేదో అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read | MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’