కరోనా వైరస్ : ఒకే రోజు 15మంది మృతి.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 02:34 AM IST
కరోనా వైరస్ : ఒకే రోజు 15మంది మృతి.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫిబ్రవరి 9న జరగాల్సిన స్టాండర్డ్ చార్టర్డ్ హాంకాంగ్ మారథాన్ ను వాయిదా వేశారు. 

snakke

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా:
కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయం బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. పొరుగు దేశం చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ వందల మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 41మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. 

Also Read : కోటి రూపాయలు ఉంటేనే కరోనా వైరస్‌కు ట్రీట్‌మెంట్!!

cor3

చైనాలో పుట్టి.. సౌదీ వరకు పాకింది:
చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ వరకు పాకింది. అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది? ఏ జంతువు నుంచి మనుషుల్లో సంక్రమించింది అనేది అంతు చిక్కడం లేదు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేదానిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. పాములు నుంచే సంక్రమించిందంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

cor4

కరోనా వైరస్ మూలం ఏంటి?:
కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ పుట్టుక పాముల నుంచే సంక్రమించింది అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే, పాములకు మనుషులకు సంబంధమేంటి? పాముల నుంచి మనుషులకు ఎలా ఈ వైరస్ సంక్రమించిందంటే.. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములను ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో చేపలు, పందులు, గాడిద మాంసంతో పాటు పాముల మాంసం కూడా అమ్ముతుంటారు.

corr

ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చారు. పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు. మనుషుల్లో సంక్రమణకు ముందుగా పాముల్లోనే ఈ వైరస్​ ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

* రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా వైరస్
* చైనాలో 41కి చేరిన కరోనా మృతుల సంఖ్య
* ఒక్క రోజే 15మంది చనిపోయినట్లు వెల్లడి

* చైనాలో 13 నగరాలకు రవాణ బంద్
* హాంకాంగ్ లో అత్యున్నత ఎమర్జెన్సీ
* ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేత

Also Read : కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?