Pregnant : గర్భిణులు కూడా కరోనా టీకా వేయించుకోవచ్చు..ప్రమాదమేమీ ఉండదు

గర్భిణులు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని..నిపుణులు తెలిపారు. గర్భంతో ఉన్నవారు టీకా వేయించుకన్నా..మాయకు ఎటువంటి ప్రమాదం ఉండదని తెలిపారు.

Pregnant : గర్భిణులు కూడా కరోనా టీకా  వేయించుకోవచ్చు..ప్రమాదమేమీ ఉండదు

Pregnant Corona Vaccine

pregnant women covid 19 vaccine : కరోనా వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవచ్చు? గర్భంతో ఉన్న మహిళలకు టీకా వేయించుకోవచ్చా? లేదా? అనే అనుమానాలు వస్తున్న వేళ దీనిపై క్లారిటీ ఇచ్చారు నిపుణులు. దీనిపై పరిశోధనలు చేసిన అనతరం నిపుణులు క్లారిటీ ఇచ్చారు. గర్భిణులు టీకా వేయించుకోవచ్చనీ..తల్లీకి బిడ్డకు ఎటువంటి ప్రమాదము ఉండదని తెలిపారు.టీకాలు గర్భిణులకు కూడా సురక్షితమేనని చెబుతున్నారు. కరోనా టీకాలు వేయించుకున్న 84 మంది గర్భిణులను..టీకా వేయించుకోని 116 మంది గర్భిణులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని..అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

టీకాల వల్ల గర్భంలోని మాయకు హాని కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు లభించలేదని ‘ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మాయ అనేది విమానాల్లో బ్లాక్‌బాక్స్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మాయలో సంభవించే మార్పులు గర్భంలో తలెత్తే సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

కరోనా టీకాలు వేయించుకున్న 84 మందిని..వేయించుకోని 116 మంది గర్భిణులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని వివరించారు. టీకాల వల్ల మాయకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేలిందన్నారు. అయితే, ఇది ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని, మరింత మందిని అధ్యయనం చేయడం ద్వారా అంతిమంగా ఓ నిర్ణయానికి రావొచ్చన్నారు.

గర్భస్థ శిశువుకు కరోనా సంక్రమించకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం తల్లికి టీకా వేయడమేనని, ఆమె ద్వారా యాంటీబాడీలు శిశువుకు కూడా చేరుతాయని ఆయన పేర్కొన్నారు. హార్మోనుల తయారీ మొదలు వ్యాధుల రక్షణకు వ్యవస్థలు ఏర్పడడానికి కూడా మాయే ఆధారమని పేర్కొన్నారు. టీకా వేసుకున్నతర్వాత కూడా మాయ యథావిధిగా తన పని తాను చేస్తోందని తమ పరిశోధనలో తేలిందని గోల్డ్‌స్టీన్ వివరించారు.

గర్భధారణ సమయంలో ఏర్పడే మొదటి అవయవం మాయ. దీన్నే మావి అని కూడా అంటారు. శిశువుకు అవయవాలు ఏర్పడుతున్నప్పుడు ఈ మాయ చాలా విధులను నిర్వర్తిస్తుంది. గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న ఒక అవయవం అనికూడా చెప్పవచ్చు. ఇది ఒక రకమైన జిగట ద్రవ్యరాశి.ఇది గర్భాశయానికి అనుసంధానించబడి ఉంటుంది. అంతేకాదు మాయ ద్వారా తల్లీ..బిడ్డల మధ్య ముఖ్యమైన సంబంధం ఏర్పడుతుంది. మావి ద్వారా, శిశువు ఆక్సిజన్ మరియు దాని గర్భధారణ 40 వారాలలో అభివృద్ధి చెందడానికి మరియు పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలను పొందుతుంది.

ఈ మాయా అవయవం యొక్క లక్షణాలలో ఒకటి, అది అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని అన్ని అవసరాలను అందించడానికి శిశువుతో పెరుగుతుంది. కానీ గర్భధారణ పూర్తయిన తర్వాత, మావి పనిచేయడం మానేసి క్షీణిస్తుంది. ఈ విధంగా, శిశువు జన్మించిన తర్వాత, మావి ప్రసవించబడుతుంది (సాధారణంగా సహజంగా) స్త్రీ శరీరం నుండి అదృశ్యమవుతుంది. ఇలా పిండం పెరుగుదలలో మాయ పనితీరు అద్వితీయంగా ఉంటుంది. పిండం ఎదుగుదలకు కీలకమైన మాయకు కరోనా టీకా వేయించుకోవటం వల్ల ఎటువంటి హానీ జరగదని నిపుణులు చెబుతున్నారు.