Russian Women: మహిళ శరీరాన్ని పెంపుడు పిల్లులే తినేశాయ్..
చనిపోయిన మహిళను పెంపుడు పిల్లులే తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి.. పిల్లులు తినేసిన మిగతా శరీర భాగాలు కనిపించాయి.
Russian Women: చనిపోయిన మహిళను పెంపుడు పిల్లులే తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి.. పిల్లులు తినేసిన మిగతా శరీర భాగాలు కనిపించాయి. దానిని బట్టి ఆమె మృతిచెంది రెండు వారాలు గడిచి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పిల్లులన్నీ ఆమె పెంచుకునేవే కావడం గమనార్హం.
రష్యన్ సిటీ అయిన బటైస్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు వారాల పాటు ఆహారం దొరక్కపోవడంతో పిల్లులు మృతదేహాన్ని తినేసి ఉండొచ్చని యానిమల్ రెస్క్యూ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడా పిల్లులను పెంచుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు.
హాంప్ షైర్ లో ఉండే ఓ మహిళ డెడ్ బాడీని రెండు నెలల తర్వాత కనుగొనడంతో అప్పటికే పెంపుడు పిల్లులు సగానికి పైగా శవాన్ని తినేశాయి. ఆమెతో పాటుగా చనిపోయిన పెంపుడు పిల్లుల్ని, కుక్కల్ని జానెట్ వీల్ అనే పోలీసు అధికారి గమనించారు.
Read Also: వృద్ధురాలి మృతదేహాన్ని తినేసిన పెంపుడు పిల్లులు