G7సమ్మిట్ కు భారత్ ను ట్రంప్ ఆహ్వానించడంపై భగ్గుమన్న చైనా

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 12:17 PM IST
G7సమ్మిట్ కు భారత్ ను ట్రంప్ ఆహ్వానించడంపై భగ్గుమన్న చైనా

G7 సమ్మిట్ కి భారత్, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా భగ్గుమంది. బీజింగ్ కు వ్యతిరేకంగా ఏ చిన్న గీత గీసినా అది విఫలమవుతుందని, అన్ పాపులర్ అవుతుందని మండిపడింది. G7అనేది అభివృద్ధి చెందిన ఏడు దేశాల కూటమి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో కూడిన ఈ కూటమి ఏటా సమావేశమై…గ్లోబల్ గవర్నెన్స్,క్లైమాట్ ఛేంజ్,సెక్యూరిటీ,ఎకానమీ వంటి విషయాలపై చర్చిస్తుంది.

కరోనా వైరస్ నేపథ్యంలో సెప్టెంబర్ కు G-7సమ్మిట్ ను వాయిదావేసిన డొనాల్డ్ ట్రంప్….కాలం చెల్లిన ఈ కూటమిని జీ-7 అని వ్యవహరించే బదులు ఇందులో ..భారత్ లో సహా మరో మూడు దేశాలను కూడా చేరిస్తే.. అది జీ-10 లేదా, జీ-11 అవుతుందని చెప్పారు. ఈ గ్రూప్ లో భారత్,రష్యా,దక్షిణ కొరియా,ఆస్ట్రేలియాలను కలుపుకుని G-11మార్చాలని ట్రంప్ ఆశించారు.

ఇందులో భాగంగానే మంగళవారం G-7సమ్మిట్ లో పాల్గొనాలని భారత ప్రధానమంత్రి మోడీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో ఫ్రెంచ్ దేశంలోని బియారిట్జ్ లో జరిగిన జీ7సమ్మిట్ లో… ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రోన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఏడాది జీ7 సమ్మిట్ కు భారత్ మరియు మరో మూడు దేశాలను ఆహ్వానించాలన్న ట్రంప్ ఆలోచనలపై చైనా విదేశీ మంత్విత్వశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానిస్తూ.. అన్ని అంతర్జాతీయ సంస్థలు, కాన్ఫరెన్సులు ఆయా దేశాల మధ్య పరస్పర విశ్వాసం, అంగీకారంతోనే జరగాలని చైనా నమ్ముతుందని తెలిపారు. ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఈ విధమైన పాత్రనే పోషించాలని, మా దేశానికి వ్యతిరేకంగా చిన్న సర్కిల్ గీసినా అది ఫెయిల్ అవుతుందని, పాపులర్ కాబోదని తెలిపారు. హాంకాంగ్ పై పెత్తనం

Read: ట్రంప్ పై ఏమంటారని అడిగితే….మూగబోయిన కెనడా ప్రధాని