డ్రీమ్ లో డ్రీమ్ గర్ల్స్ డిమాండ్ : నిద్రలోనే నిజంగా శరీరం కోసుకున్నాడు

అతడికి అమ్మాయిలంటే పిచ్చి. వెర్రి.. వ్యామోహం... ఎప్పుడు నిద్రపోతుంటాడు.. ఒకటే కలలు కంటుంటాడు. ఆ కలల్లో అమ్మాయిలు వస్తుంటారు. వచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటారు. ఆ కోరికలను ఇతగాడు తీరుస్తుంటాడు.

  • Published By: sreehari ,Published On : April 16, 2019 / 01:41 PM IST
డ్రీమ్ లో డ్రీమ్ గర్ల్స్ డిమాండ్ : నిద్రలోనే నిజంగా శరీరం కోసుకున్నాడు

అతడికి అమ్మాయిలంటే పిచ్చి. వెర్రి.. వ్యామోహం… ఎప్పుడు నిద్రపోతుంటాడు.. ఒకటే కలలు కంటుంటాడు. ఆ కలల్లో అమ్మాయిలు వస్తుంటారు. వచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటారు. ఆ కోరికలను ఇతగాడు తీరుస్తుంటాడు.

అతడికి అమ్మాయిలంటే పిచ్చి. వెర్రి.. వ్యామోహం… ఎప్పుడు నిద్రపోతుంటాడు.. ఒకటే కలలు కంటుంటాడు. ఆ కలల్లో అమ్మాయిలు వస్తుంటారు. వచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటారు. ఆ కోరికలను ఇతగాడు తీరుస్తుంటాడు. కలలో డ్రీమ్ గర్ల్స్ డిమాండ్ చేస్తే.. ఎంతకష్టమైన పనైనా ఇట్టే చేసేస్తాడు. అతడే.. నైజేరియాకు చెందిన వాహబ్ సాదు (35). ఫ్యాషన్ డిజైనర్ కూడా. అమ్మాయిల కోసమే నిద్రపోతుంటాడు. నిద్రలోనే డ్రీమ్ గర్ల్స్ తో రొమాన్స్ చేస్తుంటాడు. అదే నిజమనుకుని ఆనందించడం ఇతడి అలవాటు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

ఫస్ట్ డ్రీమ్.. బ్యాటరీ యాసిడ్ తాగేశాడు :
గుర్తు తెలియని ముగ్గురు అమ్మాయిలు ఓ రోజు సాదు కలలోకి వచ్చారు. ఈ అమ్మాయిలు ఎవరో అతడికి తెలియదు. కలలోనే పరిచయం.. అంతే.. వెంటనే.. తనతో శృంగారంలో పాల్గొనాలని అమ్మాయిలను కోరాడు. అందుకు వారు కలలో ఓ కండీషన్ పెట్టారట. బ్యాటరీ యాసిడ్ తాగేయమని చెప్పారట. అలా అయితేనే తనతో శృంగారం చేస్తామని అన్నారట. అంతే.. సాదు.. మరుసటి రోజు ఉదయం బ్యాటరీ యాసిడ్ ను తాగేశాడట. తాను చేసిన పని ఎవరికి తెలియదని చెప్పుకోచ్చాడు. 

సెకండ్ డ్రీమ్.. ఏకంగా అదే కట్ చేశాడు :
మూడు రోజుల తర్వాత మళ్లీ అదే ముగ్గురు అమ్మాయిలు సాదు డ్రీమ్ లోకి వచ్చారు. రొమాన్స్ చేయాలని వారిని వేడుకున్నాడు. అయితే ఈసారి.. ఆ డ్రీమ్ గర్ల్స్ వింత కోరిక కోరారు. శృంగారం చేయాలంటే.. ముందుగా తన మర్మాంగాన్ని కోసుకోవాలని చెప్పారట. అది కలో నిజమో తెలియలేదు. క్షణం కూడా ఆలోచించకుండా రేజర్ బ్లేడ్ తో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. స్పృహ లోకి వచ్చిన అతడు.. అయ్య బాబోయ్.. నొప్పి.. అంటూ లేచి కూర్చున్నాడు. ఇంకేముంది.. నిజంగానే తన మర్మాంగం కట్ అయింది. తీవ్ర రక్తస్రావం అవుతోంది.

మంత్రవిద్యలు చేస్తున్నారని ఆరోపణ :
ఏం చేయాలో తెలియక.. కట్ చేసిన మర్మాంగంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. ఆస్పత్రిలో వైద్యులు సాదుకు శస్త్రచికిత్స చేసి తిరిగి అమర్చారు. ప్రస్తుతం వాహబ్ సాదు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై అక్కడి కుటుంబ సభ్యులు, వైద్యులు ప్రశ్నించగా.. అతడు చెప్పిన వివరాలు అందరికి షాకింగ్ కు గురిచేశాయి. తనపై కొందరు మంత్రగత్తెలు తనపై మంత్రవిద్యలు ప్రయోగిస్తున్నారని, అందుకే తనకు ఇలా వింత కలలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 2015లో ఈ ఘటన జరిగితే.. దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

గత ఫిబ్రవరిలో తన భర్తతో గొడవపడిన భార్య అతడి మర్మాంగాన్ని కోసేసింది. అంతటితో ఆగకుండా.. దాన్ని పెనంలో న్యూడిల్స్ తో కలిపి వండింది. ఈ షాకింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు రియలో ఫేకో తెలియదు.  
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి