Christians-minority: మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిన ఇంగ్లండ్, వేల్స్‌.. హిందువుల జనాభా ఎంత?

ఇంగ్లండ్, వేల్స్‌ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం తగ్గింది. ఏ మతాన్నీ అనుసరించడం లేదని చెబుతున్న వారి సంఖ్య 2011తో పోల్చి 2021లో 12 పాయింట్లు పెరిగి 37.2 శాతానికి (మొత్తం జనాభాలో) చేరింది. అంటే 2.22 కోట్ల మంది ఏ మతాన్నీ అనుసరించట్లేదు. జనాభాలో ముస్లింల శాతం 6.5 శాతం (39 లక్షలు)గా ఉంది. వీరి జనాభా 2011లో 4.9 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ఆ తర్వాత హిందువులు 10 లక్షల మంది, సిక్కులు 5,24,000 మంది, బౌద్ధమతం వారు 2,73,000, యూదులు 2,71,000 మంది ఉన్నారు.

Christians-minority: మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిన ఇంగ్లండ్, వేల్స్‌.. హిందువుల జనాభా ఎంత?

Christians-minority

Christians-minority: ఇంగ్లండ్, వేల్స్‌ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఇంగ్లండ్, వేల్స్‌ మొత్తం జనాభాలో క్రిస్టియన్ల జనాభా సగం కన్నా తక్కువగా (46.2 శాతం) ఉంది. తాజాగా విడుదల చేసిన జనగణన డేటా ద్వారా ఈ వివరాలు తెలిశాయి. బహుళ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారు ఉండే బ్రిటన్ లో మహోన్నత లౌకికవాద విలువలు విరబూస్తున్నాయని ఈ డేటా ద్వారా స్పష్టమవుతోంది.

ఇంగ్లండ్, వేల్స్‌ లో ఇంతకు ముందు క్రిస్టియన్లు అధికంగా ఉండేవారు. ఏ మతాన్నీ అనుసరించని వారు ఇప్పుడు విపరీతంగా పెరిగారు. క్రిస్టియన్ల తర్వాత ఏ మతాన్ని అనుసరించని వారే అధికంగా ఉన్నారని యూకే జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. 2021 జనగణనలో తేలిన మతపర అంశాలు ఇంగ్లండ్, వేల్స్‌ లో కీలక మార్పులు తెచ్చే అవకాశం ఉంది. బ్రిటన్ లో క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి.

అయితే, సమాజంలో మతపర పాత్రపై పున:పరిశీలన చేయాల్సి ఉందని తాజా జనగణన ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం తగ్గింది. ఏ మతాన్నీ అనుసరించడం లేదని చెబుతున్న వారి సంఖ్య 2011తో పోల్చి 2021లో 12 పాయింట్లు పెరిగి 37.2 శాతానికి (మొత్తం జనాభాలో) చేరింది.

Exit Polls: గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారం.. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ

అంటే 2.22 కోట్ల మంది ఏ మతాన్నీ అనుసరించట్లేదు. జనాభాలో ముస్లింల శాతం 6.5 శాతం (39 లక్షలు)గా ఉంది. వీరి జనాభా 2011లో 4.9 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ఆ తర్వాత హిందువులు 10 లక్షల మంది, సిక్కులు 5,24,000 మంది, బౌద్ధమతం వారు 2,73,000, యూదులు 2,71,000 మంది ఉన్నారు.

2021 జనగణన వివరాలను బ్రిటిష్ మొట్టమొదటి హిందూ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల తర్వాత అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇంగ్లండ్, వేల్స్‌ దేశాల్లో క్రిస్టియన్లు తగ్గిపోగా, ముస్లింల జనాభా బాగా పెరిగింది. కొంతకాలంగా క్రిస్టియన్ల నిష్పత్తి తగ్గుతూ వస్తోందని, ఇందులో అంతగా ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదని ఆర్చ్ బిషప్ (ఇంగ్లండ్ చర్చి) స్టీఫెన్ కాట్రెల్ చెప్పారు.

అయితే, యూరప్ లో పెరిగిపోయిన జీవన వ్యయం, యుద్ధాలు వంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇప్పటికీ ఆధ్యాత్మిక జీవనాధార అవసరం ఉందని చెప్పారు. తాము చాలా మందికి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. తమ సేవల్లో ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు పాలుపంచుకుంటున్నారని చెప్పారు. ఏ మతాన్నీ అనుసరించని వారి హక్కుల కోసం పోరాడుతున్న యూకేలోని మానవతావాదులు మాత్రం క్రైస్తవ మతంతో సంబంధం లేకుండా పాలసీలను రూపొందించాల ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..