అగ్నిప్రమాదం… 11 మంది వలస కూలీలు మృతి

రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 07:59 PM IST
అగ్నిప్రమాదం… 11 మంది వలస కూలీలు మృతి

రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది.

రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన 11 మందిలో 10 మందిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించామని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన మృతురాలు రష్యా మహిళ అని స్థానిక అధికారులు తెలిపారు.

ప్రిచులింస్కై సెటిల్‌మెంట్‌లోని ఓ ప్రైవేటు టింబర్‌ డిపోలో ఈ ప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగి అక్కడే కలపతో నిర్మించిన ఇంట్లో ఉంటున్న కూలీలు మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. కారకులపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్‌ చెప్పారు. మధ్య ఆసియాకు చెందిన లక్షల మంది వలస కూలీలు రష్యాలో పనులు చేస్తూ జీవిస్తున్నారు.

అయితే, బాధితుల్లో ఒకరు తాజిక్ కావచ్చని నోవోసిబిర్స్క్ లోని తాజిక్ కాన్సుల్ జనరల్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.