Imran Khan: జాగ్రత్తగా వినండి అంటూ ఐఎస్ఐ ఆరోపణలపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్

గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాల కోసం పాకిస్తాన్‭లో శక్తివంతమైన మిలిటరీ సహాయాన్ని ఇమ్రాన్ కోరారని పాకిస్తాన్ ఇంటలీజెన్స్ చీఫ్ గురువారం ఆరోపించారు.

Imran Khan: జాగ్రత్తగా వినండి అంటూ ఐఎస్ఐ ఆరోపణలపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్

Imran Khan responds on ISI chief allegations

Imran Khan: దేశ సామరస్యం కోసం, జాతీయ సంస్థలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తానేమీ మాట్లాడదలచుకోలేదని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాకు విలువైన బహుమతి ఇస్తానని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారని ఇంటర్ సర్వీసెస్ ఇంటలీజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ నదీం అంజుమ్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఈ ఆరోపణలపై ఇమ్రాన్ పై విధంగా స్పందించారు.

లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ చేపట్టిన ఇమ్రాన్.. ఈ మార్చ్‭లో భాగంగా శుక్రవారం లాహోర్‭లోని లిబర్టీ చౌరస్తాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఎస్ఐ చీఫ్ నదీం అంజుమ్ ఆరోపణలపై స్పందించారు. ‘‘నా లక్ష్యం ఒక్కటే. దేశాన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దాలి. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్‭ను సర్వస్వతంత్రంగా నిలబెట్టాలి. కొన్ని విషయాలపై స్పందించకపోవడమే మంచింది. ఎందుకంటే దేశంలో అశాంతి కారణం కావాలని కానీ, జాతీయ సంస్థలకు నష్టం కలిగే విధంగా వ్యవహరించాలని కానీ నేను అనుకోవడం లేదు. అందుకే దీనిపై మౌనమే నా సమాధానం’’ అని ఇమ్రాన్ అన్నారు.

గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాల కోసం పాకిస్తాన్‭లో శక్తివంతమైన మిలిటరీ సహాయాన్ని ఇమ్రాన్ కోరారని పాకిస్తాన్ ఇంటలీజెన్స్ చీఫ్ గురువారం ఆరోపించారు. అంతే కాకుండా తాను అధికారంలోకి వస్తే మిలిటరీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాకు విలువైన బహుమతి ఇస్తానని హామీ ఇచ్చినట్లు అంజుమ్ ఆరోపించారు.

ఏప్రిల్ నెలలో విపక్షాలు ఏకమై ఇమ్రాన్ ఖాన్‭ను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించే ముందు మిలిటరీ సహాయం కోసం ఆయన తరుచూ అభ్యర్థించారని అయితే ఆయన అభ్యర్థన తిరస్కరించబడిందని అంజుమ్ పేర్కొన్నారు. కాగా, ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‭లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాలించింది. ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలిస్తున్నప్పటికీ.. భద్రత, విదేశీ పాలసీల విషయంలో ఇప్పటికీ సైన్యానిదే పైచేయిగా ఉంది. ఇకపోతే, ఏప్రిల్‭లో పాకిస్తాన్ పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఓడిపోయి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయారు.

ఇక అప్పటి నుంచి ముందస్తు ఎన్నికలు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు లాహోర్ నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వరకు యాత్ర చేపట్టారు. వారం రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఖాన్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరులో నిర్వహిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

CM Gehlot: ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఫాసిస్టు పార్టీ బీజేపీ.. రాజస్తాన్ సీఎం గెహ్లాట్