నర్సులు అప్సరసలుగా కన్పించారన్న ఇమ్రాన్..నెటిజన్లు ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : January 28, 2020 / 02:45 PM IST
నర్సులు అప్సరసలుగా కన్పించారన్న ఇమ్రాన్..నెటిజన్లు ఫైర్

హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ కు సంబంధించిన 40సెకండ్ల వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఒక్క ఇంజక్షన్ ప్రధానమంత్రిని నర్సులను అప్సరసులుగా చూసేలా చేసింది అనే కాప్షన్ తో ఆ వీడియోను ఇనాయత్ షేర్ చేసింది. వెంటనే ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో…ఇటీవల కరాచీలో షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో ప్రసంగించిన ఇమ్రాన్ తాను ఒకప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సందర్భం గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో నేను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. అప్పుడు డాక్టర్ నాకో ఇంజెక్షన్ ఇచ్చారు.

అది ఏదో నాకు పెద్దగా గుర్తులేదు కానీ…ఇంజెక్షన్ తీసుకున్న తరువాత మాత్రం నాకు ప్రపంచమంతా మారిపోయినట్టు అనిపించింది. నర్సులను చూస్తే అప్సరసలుగా కనిపించారు. నొప్పి మొత్తం ఒక్కసారిగా మాయమైంది. ఆ తరువాత ఆసుపత్రి ఆవరణలోనే నేనో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అప్పుడు ఏమన్నానో నాకు పెద్దగా గుర్తులేదు అని తెలిపారు. 

అయితే ఇమ్రాన్ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ రేంజ్ లో ఇమ్రాన్‌ను  చెడుగుడాడుకుంటున్నారు. నీ స్థాయికి ఇటువంటి వ్యాఖ్యలు సబబేనా అంటూ తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు.ఈ వ్యక్తికి మెడల్ ఇవ్వండి రా బాబు,డాక్టర్ ఇమ్రాన్ కి డ్రగ్స్ ఇచ్చినట్లు కన్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.