Air pollution index 2022 : కాలుష్యంలో ప్రపంచంలో 8వ స్థానంలో భారత్..100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే

కాలుష్యంలో ప్రపంచంలో 8వ స్థానంలో భారత్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా 100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది.

Air pollution index 2022 : కాలుష్యంలో ప్రపంచంలో 8వ స్థానంలో భారత్..100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే

Air pollution index 2022

Air pollution index 2022 : కాలుష్యంలో ప్రపంచంలో 8వ స్థానంలో భారత్ ఉందని..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే ఉన్నాయని స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ మంగళవారం (మార్చి14,2023) 2022కు సంబంధించిన ‘వరల్డ్​ ఎయిర్​ క్వాలిటీ రిపోర్ట్’వెల్లడించింది. ఈ రిపోర్టులో పాకిస్తాన్​లోని లాహోర్​ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటిస్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని లాహోర్ 10 స్థానాలు ఎగబాకి 2022లో ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన గాలి ఉన్న నగరంగా అవతరించిందని స్విట్జర్లాండ్‌లోని ఎయిర్ ప్యూరిఫైయర్‌ల తయారీ సంస్థ వార్షిక గ్లోబల్ సర్వే వెల్లడించింది. లాహోర్ గాలి నాణ్యత 2021లో 86.5 నుండి క్యూబిక్ మీటరుకు 97.4 మైక్రోగ్రాముల PM2.5 కణాలకు దిగజారింది. దీంతో లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మారింది.

కాగా గత సంవత్సరంతో పోల్చిన భారత్ లో కాలుష్యం తగ్గినా..నగారాల్లో మాత్రం కాలుష్యం పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పితీరాలి. ఎందుకంటే గ్రామాల్లో కంటే నగరాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఉపాధి కోసం ..ఉద్యోగాలు, చదువుల కోసం వచ్చేవారు నగరాల్లోనే నివసిస్తుంటారు. కాగా కాలుష్యం విషయంలో భారత్ గత సంవత్సరంతో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపడింది.

Delhi Air Pollution : ఢిల్లీ పొల్యూషన్‌కి.. సొల్యూషనే లేదా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం వార్షిక సగటు..ప్రస్తుతం పీఎం 2.5 లెవల్ ప్రతి క్యూబిక్​ బీటర్​కు 53.3 మైక్రోగ్రాములకు తగ్గింది. అయినా వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్(WHO) సూచించిన సేఫ్టీ లెవల్​ కంటే మనదేశంలో కాలుష్యం 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్ 100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. గత ఏడాది టాప్​ 100లో 61 సిటీలు మాత్రమే ఉన్నాయి. 2022లో టాప్​ 50లో 39, టాప్​ 20లో 14, టాప్​ 10లో 6 సిటీలు ఉన్నాయి. కొత్త క్లాసిఫికేషన్​ ప్రకారం టాప్​ 10లో ఢిల్లీ, న్యూఢిల్లీ రెండూ ఉండటం గమనించాల్సిన విషయం. ఈ ప్రాంతాల్లో శీతాకాలం వచ్చిందంటే కాలుష్య స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేసే పరిస్థితి ఉంటుంది.

Air pollution : థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం..13లక్షల మందికి అస్వస్థత..ఒక్క వారంలోనే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 2లక్షలమంది
స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ (IQair) సంస్థ మంగళవారం 2022కు సంబంధించిన ‘వరల్డ్​ ఎయిర్​ క్వాలిటీ రిపోర్ట్’ను విడుదల చేసింది. పొల్యూషన్​కు కీలకంగా భావించే పీఎం 2.5 లెవల్​ ఆధారంగా ఈ రిపోర్ట్​ను రెడీ చేశారు. మొత్తం 131 దేశాల్లోని 30 వేలకుపైగా గవర్నమెంట్, నాన్​గవర్నమెంట్​ మానిటర్ల నుంచి డేటాను సేకరించారు. 2017లో 2,200 సిటీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 7,300 సిటీలను పరిగణనలోకి తీసుకున్నారు. పీఎం 2.5 శాతం కారణంగా ఏటా ఇండియాకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఈ రిపోర్ట్​ వెల్లడించింది. ఇందులో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్​మెంట్​ వల్ల జరుగుతున్న నష్టమే 20 నుంచి 35 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇండస్ట్రియల్​ యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్​ ప్లాంట్లు, బయోమాస్​ బర్నింగ్​ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని పేర్కొంది.

Hyderabad Pollution : ఎయిర్ పొల్యూషన్‌లో హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతోందా?

ఆగ్రాలో మాత్రం పొల్యూషన్ లెవెల్స్​ భారీగా తగ్గాయి. మొత్తంగా చూస్తే 31 సిటీల్లో రెండంకెల స్థాయిలో పొల్యూషన్​ లెవల్​ తగ్గింది. ఇందులో ఉత్తరప్రదేశ్​లోని 10, హర్యానాలోని 7 సిటీలు ఉన్నాయి. ఆగ్రాలో పొల్యూషన్​ 55 శాతం తగ్గింది. 2017-21 మధ్య పీఎం 2.5.. 85 మైక్రోగ్రాములుగా ఉంటే 2022లో అది 38 మైక్రోగ్రాములకు తగ్గింది. మరోవైపు 38 సిటీలు, టౌన్లలో గత సంవత్సరాలతో పోలిస్తే పొల్యూషన్​ పెరిగిందని ఈ రిపోర్ట్​ వెల్లడించింది. మెట్రో సిటీల విషయానికి వస్తే ఢిల్లీ తర్వాత అత్యంత కాలుష్య నగరంగా కోల్​కతా నిలిచింది. అయితే ఈ రెండు నగరాలకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. చెన్నై కొంత వరకు క్లీన్​ సిటీగా కనిపిస్తోంది. అయినా అక్కడ సేఫ్టీ లెవల్​ కంటే పొల్యూషన్ ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. 2017 సగటు కంటే కాలుష్యం స్థాయి పెరిగిన మెట్రో సిటీలు హైదరాబాద్, బెంగళూరు మాత్రమే. ఈ లిస్ట్​లో హైదరాబాద్​ 199వ ప్లేస్​లో ఉంది.

Delhi Air Pollution: ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌లా మారాల్సిందేనా?

ఇకపై ప్రపంచంలో కాలుష్య రాజధాని ఢిల్లీ కాదు. ఆ స్థానాన్ని ఇప్పుడు చాడ్ ​రాజధాని ఎన్జామెనా ఆక్రమించింది. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. పాపులేషన్​ పరంగా చూస్తే ఎన్జామెనా జనాభా పది లక్షలు కాగా.. ఢిల్లీ జనాభా నలభై లక్షలకుపైగానే ఉంటుంది. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న గుర్గామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్​లో పాపులేషన్​ లెవల్స్​ అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. వీటిలో కాలుష్యం కొంత తగ్గినా ఇండియా సగటుతో పోలిస్తే ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం లాహోర్
పాకిస్తాన్​లోని లాహోర్​ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటిస్థానంలో ఉండగా రెండోస్థానంలో చైనాలోని హోటన్​ ఉంది. రాజస్థాన్​లోని భివాడిలో కాలుష్య స్థాయిలు ఉండగా మూడోస్థానంలో ఉంది. నాలుగో ప్లేస్​లో 92.6 స్థాయిలతో ఢిల్లీ ఉంది. 9వ స్థానంలో న్యూఢిల్లీ ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికీ పీఎం 2.5 లెవల్​ 92.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది డబ్ల్యూహెచ్​వో సేఫ్​ లిమిట్​ కంటే 20 రెట్లు ఎక్కువ. అత్యంత కాలుష్య దేశాల జాబితాలో చాడ్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. రెండో ప్లేస్​లో ఇరాక్, మూడో ప్లేస్​లో పాకిస్తాన్​ ఉన్నాయి.

switzerland,IQAir,polluted city Lahore,World pollution,India,

India, is the 8th most polluted country in the world..Lahore is most polluted city