IMF : భారత్‌లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండొచ్చు- IMF

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని అందులో తెలిపింది. తక్షణమే బిలియన్ టీకాలకు ఆర్డర్ ఇవ్వాలని భారత

IMF : భారత్‌లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండొచ్చు- IMF

India Needs Imf

India Needs IMF : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భారత్ లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయని అంది. ఈ ఏడాది (2021) చివరినాటికి భారత్ లో 35శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారత్ లో 60 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలంటే 100 కోట్ల డోసులు టీకాలు అవసరం అని అభిప్రాయపడింది. తక్షణమే బిలియన్ టీకాలకు ఆర్డర్ ఇవ్వాలని భారత ప్రభుత్వానికి ఐఎంఎఫ్ సూచించింది.

మున్ముందు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఆక్సిజన్, పడకలు, ఔషధాలు లేక మరణాలు పెరగొచ్చని వెల్లడించింది. భారత్ లో నెలకొన్న పరిస్థితులు.. తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక అని ఐఎంఎఫ్ తెలిపింది. వ్యాక్సిన్ల ఎగుమతులపై అడ్డంకులను భారత్ తొలగించాలని స్పష్టం చేసింది. ఫస్ట్ వేవ్ విజృంభ‌ణ‌ను బాగానే తట్టుకున్న భారత్ లో సెకండ్ వేవ్ విజృంభణలో మాత్రం అసాధార‌ణ ప‌రిస్థితులు తలెత్తుతున్నాయ‌ని వివ‌రించింది.

భార‌త్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటో ఐఎంఎఫ్ చెప్పింది. ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు, సౌకర్యాలు అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని వివరించింది. ఆఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రమైన తొలి ద‌శ‌ ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు భారత్ లో నెల‌కొన్న పరిస్థితులు ఓ హెచ్చరిక లాంటివ‌ని ఐఎంఎఫ్ తెలిపింది.

ఇదే స‌మ‌యంలో ధ‌నిక‌ దేశాల్లో ఇప్ప‌టికే 50 శాతం నుంచి 70 శాతం మ‌ధ్య వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని తెలిపింది. ఆఫ్రికా జ‌నాభాలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు శాతం లోపు జ‌నాభాకే వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని చెప్పింది. అమెరికాలో 40శాతం పైగా జ‌నాభాకు వ్యాక్సిన్ వేశార‌ని తెలియజేసింది. కాగా, భారత్ లో రానున్న కాలం మరింత దారుణంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.