India win : వన్డే సిరీస్ భారత్ కైవసం..రెండో వన్డేలో వెస్టిండీస్ పై ఇండియా విజయం
రెండో వన్డేలోనూ ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్పటేల్ దంచికొట్టడంతో భారత్ ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. అక్షర్పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
India win : రెండో వన్డేలోనూ ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్పటేల్ దంచికొట్టడంతో భారత్ ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. అక్షర్పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్… భారత్ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా తలా ఓ చేయి వేసి ఆదుకున్నారు. అయితే ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి వంద పరుగులు అవసరమైనవేల అక్షర్ పటేల్ రెచ్చిపోయాడు.
Sam Northeast : క్రికెట్లో మరో సెన్సేషన్.. ఆ ఒక్కడే 410 పరుగులు బాదాడు
40 ఓవర్లకు 212 పరుగులతో కష్టాల్లో ఉన్న జట్టును టెయిలెంటర్లతో కలిసి ఆదుకున్నాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ రెచ్చిపోయింది. ఓపెనర్ షై హోప్ 115 రన్స్తో చెలరేగిపోయాడు. తన వందో మ్యాచ్లో శతకంతో చెలరేగాడు.
మిగతా బ్యాట్స్మెన్లో ఓపెనర్ కైల్ మేయర్స్ 39, బ్రూక్స్ 35; కెప్టెన్ నికోలస్ పూరన్ 74 రన్స్తో రాణించడంతో 50 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్, అక్షర్ పటేల్, చాహల్ తలో వికెట్ తీశారు.