అమెరికాలో భారత గర్భిణీ హత్య, భర్త ఆత్మహత్య

  • Published By: Subhan ,Published On : April 30, 2020 / 09:01 AM IST
అమెరికాలో భారత గర్భిణీ హత్య, భర్త ఆత్మహత్య

అమెరికాలో భారత్ నుంచి వెళ్లిన దంపతులు మరణించారు. 5నెలల గర్భవతి అయిన మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హడ్సన్ నదికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గరీమా కొఠారి అనే మహిళ శవం గాయాలతో ఏప్రిల్ 26న దొరికిందని జెర్సీ సిటీ పోలీస్ ఆఫీసర్స్ చెబుతున్నారు. 

రీజనల్ మెడికల్ ఎగ్జామినర్ అటాప్సీ నిర్వహించారు. దానిని బట్టే ఆమెను ఎవరో హత్య చేసినట్లుగా గుర్తించారు. శరీరం పై భాగంలో పలు గాయాలు ఉన్నాయని.. అంతేకాకుండా ఆ మహిళ 5నెలల గర్భిణీ అని కూడా వెల్లడించారు. 

ఆమె భర్త మోహన్ మాల్(37) సమీప ప్రాంతంలోనే చనిపోయినట్లు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్థారించారు. అతని మరణంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని రీజనల్ మెడికల్ ఎగ్జామినర్ అన్నారు. జెర్సీ సిటీ పోలీసులతో పాటు ప్రొసిక్యూటర్ ఆఫీస్ హోమిసైడ్ విభాగం కేసుపై విచారణ జరుపుతున్నారు. 

రెండు మృతులు ఒకటి హత్య, మరొకటి ఆత్మహత్య కింద పరిగణించినప్పటికీ పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. ఆ మహిళ చెఫ్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, భర్త ఐఐటీ పూర్వ విద్యార్థి. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేయాలని ఇద్దరూ యూఎస్ కు వచ్చారు. వారు ఉంటున్న జెర్సీ సిటీ హై రైజ్ అపార్టెమెంట్ దగ్గర్లో  నూక్కడ్ అనే రెస్టారెంట్ కొనుగోలు చేశారు. ఆ రెస్టారెంట్లోని ఉద్యోగుల్లో ఒకరు వారిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారని ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు.