ఇండిగో ఫ్లైట్ పాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇండిగో ఫ్లైట్ పాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్​ ఉర్​ రెహ్మాన్​ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. సదరు ప్రయాణికుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.

మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పాక్​​ గగనతలంలోకి ప్రవేశించిన క్రమంలో అభ్యర్థన అందిందని, 5 గంటలకు ల్యాండింగ్​కు అనుమతులు ఇచ్చినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులు చెప్పారు. మానవతా దృక్పథంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్​ చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 8.36 గంటలకు విమానం లక్నో​ బయలు దేరినట్లు తెలిపారు.

దీనిపై ఇండిగో విడుదల చేసిన ఓ ప్రకటనలో..మెడికల్​ ఎమర్జెన్సీ ఏర్పడిన ప్రయాణికుడిని కాపాడుకోలేకపోయాం. విమానాశ్రయ వైద్య బృందం అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాం. అతని కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి అని పేర్కొంది.

మరోవైపు,ఇటీవల ఇంధనం కోరత కారణంగా ఓ ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే.