‘సూసైడ్ ఫారెస్ట్’ చెట్లకు వేలాడే మృతదేహాలు..!!

  • Published By: nagamani ,Published On : October 2, 2020 / 01:12 PM IST
‘సూసైడ్ ఫారెస్ట్’ చెట్లకు వేలాడే మృతదేహాలు..!!

suicide forest ‘‘ Avukigahara ’’ : పచ్చటి చెట్లతో అందమైన పూలు పూసిన మొక్కలు. పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతిమాత కొలువుతీరినట్లుంటే ఆ అడవిలో ఎక్కడ చూసినా ‘శవాలు’ కనిపిస్తాయి. చెట్లకు వేలాడుతూ మృతదేహాలు..జంతువులు పీక్కుతిని వదిలేసిన మనుషుల కళేబరాలతో ఆ అడవి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అంత అందమైన అడవిలో ఎక్కడ చూసినా ఉరితాళ్లు కనిపిస్తుంటాయి. దీంతో ఆ అడవికి ‘ఆత్మహత్యల అడవి’ గా పేరు పడిపోయింది.




జపాన్‌లో దేశ రాజధాని టోక్యోకి సమీపంలో ఉన్న ‘‘అవుకిగహారా అటవీ’’ ప్రాంతాన్ని స్థానిక ప్రజలు ‘సూసైడ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. దీంతో ఆ అడవిని ‘సూసైడ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తుంటారు.

అవుకిగహారా అటవీ ప్రాంతం మొత్తం 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చూడటానికి పైకి పచ్చటి చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. అందంగా ఉంది కదాన్ని కళ్లారా ప్రకృతిని ఆస్వాదిద్దామని అడవి లోపలకు వెళితే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది.




చెట్లకు వేలాడే మృతదేహాలు, వన్యమృగాలు తినివదిలేసిన కళేబరాలు, మృత్యుద్వారంలా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్ని ఉరితాళ్లు అటవీ ప్రాంతమంతటా దర్శనమిస్తాయి. ఈ అడవిలో ఆత్మహత్యల ఘటనలు ఆనాటిది కాదు 1950 నుంచే ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారు ఈ అడవిలోకి వచ్చి చెట్లకు ఉరి వేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు మరి ఆ అడవికే వెళ్లి ఎందుకు చేసుకుంటారు? దీని వెనుక కారణమేంటో తెలుసుకుందాం..




జపాన్‌ పురాణాల ప్రకారం.. ఈ అడవిలో ఉండే చెట్లకు ఉరి వేసుకుంటే మృతి చెందిన తర్వాత అతీతశక్తులు వస్తాయని నమ్ముతారు. ఇంకొందరు అక్కడ ఆత్మహత్య చేసుకుంటే మరోజన్మ అనేదే ఉండదని అని నమ్ముతుంటారు. అందుకే ఈ అడవిలోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. దీంతో ఈ అడవిని దెయ్యాల నివాసించే చోటు అని స్థానికులు చెబుతుంటారు.




తరచూ స్థానిక పోలీసులు, వాలంటీర్లు అడవిలో మృతదేహాల కోసం గాలిస్తుంటారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మృతదేహాలు బైటపడుతుంటాయి. వాటిని తీసుకొచ్చి మృతుల కుటుంబసభ్యుల వివరాలు తెలిస్తే వారికి అప్పగిస్తుంటారు. లేదా పోలీసులే దహన సంస్కారాలు చేసేస్తారు.

ఆత్మహత్యలు నివారించడం కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిలో ప్రవేశ ప్రాంతాల్లో ‘మీ పిల్లల గురించి, కుటుంబం గురించి కాస్త ఆలోచించండి’. ‘నీ జీవితం తల్లిదండ్రులు నీకిచ్చిన అపూర్వమైన బహుమతి’, ‘సాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.. ఆత్మహత్య చేసుకోకండి’ అని బోర్డులు పెట్టారు. అయినా ఆత్మహత్యల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు.





ఈ అడవి ఆత్మహత్యలకు నెలవుగా మారిన ‘‘అవుకిగహారా అటవీ’
కానీ పోలీసుల కథనాలు వేరుగా ఉంటాయి. ‘‘అవుకిగహారా అటవీ’’ని చూడటానికి వెళ్లినవారు ఈ అడవిలో చిక్కుపోయి బైటకు ఎలా రావాలో తెలీక చాలామందిచనిపోతుంటారని చెబుతున్నారు. అత్యంత దట్టంగా ఉండే ఈ అటవీ ప్రాంతంలో ఎవరైన తప్పిపోతే బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే దాదాపు అన్ని చెట్లు భారీగా ఒకేలా ఉంటాయి. ఏపుగా చాలా పొడవుగా ఉంటాయి. అంతేకాదు ఈ అటవీ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఉండవు. దిక్సూచి కూడా పనిచేయదు. దిశలను రాంగ్ గా చూపిస్తాయట. అందుకే అడవిలోకి వెళ్లినవారు ప్రాణాలతో బైటకు రాలేరని పోలీసులు అంటుంటారు.




దీనికి కారణం ఈ అడవి భూగర్భంలో ఉండే అయస్కాంత లక్షణాలున్న ఇనుప ఖనిజాలే కారణమట. అందుకే పర్యటకులు అడవిలోకి వెళ్తున్నప్పుడు దారిలో చెట్లకు రబ్బర్లు పెడుతుంటారు. ఎందుకంటే ఒకవేళ అడవిలో తప్పిపోయినా వాటిని గుర్తుపట్టి బయటకు వచ్చే అవకాశముంటుందట. కానీ దారి తెలీక చనిపోతే ఆకలితోనే లేక దాహంతోనే చనిపోతారు. కానీ చెట్లకు ఎందుకు ఉరి వేసుకుంటారనే దానిపై మాత్రం పోలీసులు సైతం చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా అందమైన ఈ ‘‘అవుకిగహారా అటవీ’’ ఆత్మహత్యల అడవిగా మారిపోవటం మాత్రం అత్యంత విషాదకమైన విషయం.