నీ ధైర్యానికి హ్యాట్సాప్ : ఒంటి కాలుతో వీరజవాన్ స్కైడైవ్

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 10:54 AM IST
నీ ధైర్యానికి హ్యాట్సాప్ : ఒంటి కాలుతో వీరజవాన్ స్కైడైవ్

ప్రాణాలనుపణంగా పెట్టి దేశం కోసం పోరాడే తెగువ..అంకిత భావం వీర జవాన్ల సొంతం. దేశం కోసం అమరులైనా.. వారసులమంటూ కుటుంబాల్లో నుంచి సైన్యంలో చేరటం చూస్తున్నాం. సైనికులంటే అదీ.. ఎటువంటి పరిస్థితిలోనైనా వెనుకడుగేయని నైజంతో కార్గిల్ యుద్ధంలో కాలు కోల్పోయినా తన స్థైర్యాన్ని మరోసారి చాటి చెప్పాడు మేజర్ డీపీ సింగ్. 

నాసిక్‌లోని ఎత్తైన కొండలు వీర జవాన్ నిర్వహించిన ఈ అద్భుతానికి వేదికయ్యాయి. వివిధ సందర్భాల్లో గాయపడిన అవయవాలు కోల్పోయిన సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ ఫీట్ చేశానని.. ఈ ఫీట్ కోసం ఇండియన్ ఆర్మీకి చెందిన నిపుణుల బృందంతో ట్రైనింగ్ తీసుకున్నానని  మేజర్ డీపీ సింగ్ స్వయంగా తెలిపారు. 

సరిహద్దులో విధులు నిర్వహిస్తూ క్షతగాత్రులైన సైనికుల్లో స్థైర్యం నింపే కార్యక్రమాల్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. డీపీ సింగ్‌కు ఈ ఫీట్ నిర్వహించడానికి అనుమతిచ్చారు. ఇందుకోసం మార్చి 18 నుంచి కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. గురువారం (మార్చి 28) స్కైడైవ్ విజయవంతంగా నిర్వహించారు. జవాన్ డీపీ సింగ్‌పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

భారత్‌లో ఇలాంటి ఓ ఫీట్ ఇదే తొలిసారి కావడం మరో విశేషం. కృత్రిమంగా అమర్చిన బ్లేడ్‌తో పరుగుపందెంలో పోటీ చేసి ‘ఇండియన్ బ్లేడ్ రన్నర్’గా గుర్తింపు పొందారు. అంతేకాదు..యుద్ధాలు, వివిధ ఘటనల్లో శరీర భాగాలు కోల్పోయి దీన స్థితిని అనుభవిస్తున్న సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి అరుదైన..అద్భుతమైన ఫీట్ నిర్వహించారు. ‘స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్’ పేరుతో స్కైడైవ్ నిర్వహించారు.