Mahatma Gandhi’s statue: అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి కలకలం రేపిన యువకులు

అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌ సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీతులసీ మందిర్‌ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు దాని ద్వారా తెలుస్తోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహంపై దాడి చేయగా, అనంతరం మరికొందరు వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత ఆ దుండగులు రెండు వాహనాల్లో పారిపోయారు.

Mahatma Gandhi’s statue: అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి కలకలం రేపిన యువకులు

Mahatma Gandhi's statue

Mahatma Gandhi’s statue: అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌ సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీతులసీ మందిర్‌ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు దాని ద్వారా తెలుస్తోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహంపై దాడి చేయగా, అనంతరం మరికొందరు వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత ఆ దుండగులు రెండు వాహనాల్లో పారిపోయారు.

వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారంతా 25 నుంచి 30 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారేనని అధికారులు భావిస్తున్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్ స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళింది.

న్యూయార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరగడం రెండు వారాల్లో ఇది రెండవ సారి. తాజాగా చేసిన దాడిలో భాగంగా పెయింట్‌తో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాసి వెళ్ళారు దుండగులు. ఆగస్టు 3న కూడా ఇదే విగ్రహంపై దాడి జరిగింది. గాంధీ విగ్రహంపై దాడి ఘటనను న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్‌ రాజ్‌ కుమార్‌ ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని అన్నారు.

Russia-Ukraine war: రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం ప్రకటించిన అమెరికా