నాలుగు టన్నుల ఏనుగు దంతాలు తగలబెట్టిన మలేషియా
దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగతా దేశాలకు భారీ స్థాయిలో జరుగుతున్న ఏనుగు దంతాల అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్మగ్లర్లు ఏనుగు దంతాలను చైనా, వియత్నాం వంటి మేజర్ అంతర్జాతీయ మార్కెట్ లకు అక్రమ రవాణా చేస్తుంటారు.
2011-17 మధ్య కాలంలో మలేషియాలోని ఎయిర్ పోర్టులు,తీర ప్రాంత పోర్టులల్లో 3.92 టన్నుల ఏనుగు దంతాలు,వాటి సంబంధిత ఉత్పత్తులను సీజ్ చేసినట్లు మలేషియా జల, సహజ వనరుల శాఖ మంత్రి జయకుమార్ తెలిపారు. స్మగ్లర్లు ఏనుగు దంతాలను చైనా, వియత్నాం,హాంకాంగ్ వంటి దేశాలకు అక్రమ రవాణా చేయడం కోసం మలేషియాను ట్రాన్స్ పోర్ట్ హబ్ గా మార్చుకున్నారని ఆయన తెలిపారు.