Belgium :దూసుకొస్తున్న రైలు కిందకు ప్లాట్ ఫాంపైనుంచి మహిళను తోసేసిన వ్యక్తి..!

రోజియం మెట్రో స్టేషన్ లో కొంతమంది ప్రయాణీకులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఓ మహిళ రైలు కోసం నిలబడింది. అప్పటి వరకు ప్లాట్ ఫాం అటూ ఇటూ నడిచిన ఓ వ్యక్తి..

Belgium :దూసుకొస్తున్న రైలు కిందకు ప్లాట్ ఫాంపైనుంచి మహిళను తోసేసిన వ్యక్తి..!

Train

Woman In Front Of  Train : రైలు కోసం కొంతమంది ప్లాట్ ఫాంపై ఎదురు చూస్తూ నిల్చొన్నారు. కొద్దిదూరం నుంచి ఓ రైలు వస్తోంది. అంతలోనే కలకలం.. ఓ మహిళ ప్లాట్ ఫాంపై నుంచి రైలు పట్టాలపై పడిపోయింది. కానీ..ఆమె కావాలనే దూకలేదు. ఎవరో తోసేశారని అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూపించాయి. అందరూ ఆమె చనిపోయిందని అనుకున్నారు. ఈ ఘటన బెల్జియం రాజధానిలోని రోజియర్ మెట్రో స్టేషన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆ వ్యక్తి..ఆ మహిళను ఎందుకు తోసేశాడో తెలియరాలేదు.

Read More : Abu Dhabi : అబుదాబి ఉగ్రదాడిలో ముగ్గురు మృతి..అందులో ఇద్దరు ఇండియన్స్ ?

రోజియం మెట్రో స్టేషన్ లో కొంతమంది ప్రయాణీకులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఓ మహిళ రైలు కోసం నిలబడింది. అప్పటి వరకు ప్లాట్ ఫాం అటూ ఇటూ నడిచిన ఓ వ్యక్తి…ఆ మహిళను అమాంతం ఎదురుగా వస్తున్న రైలు ముందకు తోశాడు. ఆ మహిళ రైలు పట్టాలపై పడిపోయింది. అమాంతం ట్రైన్ డ్రైవర్ అలర్ట్ అయి బ్రేకులు వేయడంతో రైలు ఆమె వద్దకు వచ్చి ఆగిపోయింది.

Read More : CM Jagan : ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించండి.. కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి

లేకపోతే..రైలు ఆమెపై నుంచి వెళ్లేది. బ్రేకలు వేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహిళను తోసేసిన అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేరొక మెట్రో స్టేషన్ లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.