జైలు నుంచి తప్పించుకున్న 100మంది ఖైదీలు
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో 100మందికి పైగా ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఇండోనేషియన్ జైలులో ఉదయం పలువురు ఖైదీలు మెథాఫిటమైన్ అనే డ్రగ్స్ తీసుకుంటుండగా గమనించిన గార్డ్స్ వారిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దీంతో జైలులో అల్లర్లు చోటుచేసుకోగా.. జైలులో అగ్నిప్రమాదం సంభవించింది.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలోనే ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఈ అల్లర్లలో ముగ్గురు ఖైదీలకు కత్తిపోట్లు పడగా.. ఓ పోలీస్పై కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన అధికారలు కొంతమంది ఖైదీలను అయితే తిరిగి పట్టుకోగలిగారు. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు.. స్థానికులు, ఆర్మీ భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు.