డ్రగ్స్ కేసు : IPL పంజాబ్ టీం ఓనర్ నెస్ వాడియాకు రెండేళ్ల జైలు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 06:33 AM IST
డ్రగ్స్ కేసు : IPL పంజాబ్ టీం ఓనర్ నెస్ వాడియాకు రెండేళ్ల జైలు

ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కో ఓనర్ నెస్ వాడియాకు జపాన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నెస్ వాడియా జపాన్ లోని చితోస్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. 2019 మార్చిలో ఈ ఘటన జరిగింది. నెస్ వాడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. సపోరో డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసుని విచారించింది. మంగళవారం (ఏప్రిల్ 30,2019) తీర్పు ఇచ్చింది. వాడియాకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

నెస్ వాడియా గతంలోనూ పలు కేసుల్లో చిక్కుకున్నాడు. నెస్ వాడియా బాలీవుడ్ నటి ప్రీతి జింటా మాజీ ప్రియుడు. 2014లో వాంఖడే స్టేడియంలో ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రీతి జింటా కేసు పెట్టింది.

ఆ తర్వాత నెస్ వాడియా తండ్రి నుస్లి వాడియా కోరిక మేరకు ఆమె కేసు ఉపసంహరించుకుంది. నుస్లి వాడియా ప్రముఖ వ్యాపారవేత్త. నుస్లి వాడియా పెద్ద కొడుకే నెస్ వాడియా.