ప్రజల ఒత్తిడికి తలొగ్గిన పాక్ : భారత్ మందులపై నిషేధం ఎత్తివేత

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 05:11 AM IST
ప్రజల ఒత్తిడికి తలొగ్గిన పాక్ : భారత్ మందులపై నిషేధం ఎత్తివేత

పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ పై ఉన్న కోపాన్ని తన ప్రజలపై చూపెట్టింది. అత్తమీద కోపం బిడ్డపై చూపెట్టినట్లుగా అయ్యింది పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో భారత్ పై కక్ష సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్న పాక్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే అత్యవసర మెడిసిన్స్ పై  నిషేధాన్ని విధించింది. ముఖ్యంగా ప్రాణాలను కాపాడే క్యాన్సర్, గుండెకు సంబంధించిన మెడిసిన్స్ దిగుమతిని నిలిపివేసింది. అది పాక్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అత్యవసర ఔషదాల కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు ప్రభుత్వంపై మండిపడ్డారు. మా ప్రాణాలతో చెలగాటమాడతారా  అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పాక్ ప్రజల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో  భారత్ నుంచి అత్యవసర ఔషధాలను తిరిగి దిగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. దీనికి సంబంధించి చట్టబద్ధమైన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

కాగా..ఔషధాల ఉత్పత్తిలో భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. గత 16 నెలల కాలంలో పాక్ భారతదేశం నుంచి రై.250 కోట్ల రూపాయల (36 మిలియన్ డాలర్లు) విలువ చేసే యాంటీ రాబీస్, యాంటీ వీనం వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది. కానీ 370 ఆర్టికల్ రద్దు అనంతరం పాక్ భారత్ పై ఎన్నో విధాలుగా సాధించాలని చూసింది. తన బుద్దిని చూపెట్టుకుంది. పాక్ లో భారతీయ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

ఇరు దేశాల మధ్య రైలు, బస్సు సర్వీసులల్ని నిలిపివేసింది. భారతీయ సినిమాలను పాక్ లో భారతీయ సినిమాలు.. వాణిజ్య ప్రకటనల్ని కూడా పాక్ నిషేధించింది. ఇలా భారత్ పై కక్ష సాధింపు చర్యల్ని చేపట్టిన పాక్..ఔషధాల దిగుమతిని కూడా నిషేధించింది.  దేశంలో అత్యవసర మెడిసిన్స్ కొరత ఏర్పడటంతో ఇది పాక్ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. దీంతో తిరిగి భారత్ నుంచి ఎమర్జన్సీ మెడిసిన్స్ దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.