F-16 పాక్ దుర్వినియోగం:భారత్ ఆధారాలు..అమెరికా దర్యాప్తు

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 08:48 AM IST
F-16 పాక్ దుర్వినియోగం:భారత్ ఆధారాలు..అమెరికా దర్యాప్తు

అమెరికా :  భారత్..పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత  సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపినట్టు భారత్ ఆరోపించింది. 

వీటికి సంబంధించిన ఆధారాలను కూడా అమెరికాకు భారత్ సమర్పించింది. దీనిపై స్పందించిన అమెరికా..తమ నుంచి కొనుగోలు చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాలను దుర్వినియోగం చేసిందన్న అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్‌ పలాడినో తెలిపారు.  
Also Read : మరీ విడ్డూరం : పాక్‌ టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అభినందన్

ఎఫ్‌-16 ద్వారా మాత్రమే ప్రయోగించగలిగే అమ్రామ్‌ క్షిపణి ( పాకిస్థాన్ ఉపయోగించిన క్షిపణి) శకలాలు లభించినట్లు ప్రకటించిన భారత వైమానిక దళం..దానికి సంబంధించిన అన్ని ఆధారాలను మీడియా ముందు కూడా ప్రదర్శించింది. కానీ దీనిపై కూడా పాకిస్థాన్ అబద్దాలు ఆడుతోంది.  ఎఫ్‌-16 జెట్లను తాము వినియోగించలేదని బొంకుతోంది.  

ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాక్ దుర్వినియోగం చేసిందే అంశంపై మరింత సమాచారం తెప్పించుకుంటున్నామని.. తెలిపిన వైట్ హౌస్ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్‌ పలాడినో భద్రతా, ద్వైపాక్షిక నిబంధనల దృష్ట్యా ఈ విషయంలో పూర్తి విషయాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త..ఘర్షణ వాతావరణాలను తగ్గించుకోవాలని..ఇరు దేశాలు శాంతి చర్చలు చేసుకోవాల్సిన అవసరముందని పలాడినో సూచించారు. ఈ విషయంలో తమవంతు సహకారం ఉంటుందని కూడా తెలిపారు. 
Also Read : 37వేల కిలోమీటర్ల నుంచి సెల్ఫీ.. ఎంత అందంగా ఉందో

పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు..దీనికి పాక్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో భారత్‌-పాక్‌ మధ్య గగనతల దాడుల్లో మిగ్‌-21 విమానాలను భారత్ వినియోగించింది. పాక్‌ మాత్రం అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వాడినట్లు భారత వాయుసేన ప్రకటించింది. ఎఫ్‌-16 జెట్‌లను కొనుగోలు చేసిన సందర్భంలో కేవలం స్వీయ రక్షణకు మాత్రమే వినియోగించేలా అమెరికాతో పాక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నిబంధనలను అతిక్రమించి భారత్‌పై దాడులకు ఉపయోగించింది. ఈ విషయాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. 
Also Read : వన్ ఢిల్లీ.. వన్ రైడ్ : మెట్రో, బస్సు జర్నీ ఈజీ