ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 05:57 AM IST
ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే

పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపారాల ద్వారా నిధులు సమకూర్చుకుంటోందని భారత్, అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. 
 

ఈ క్రమంలో 2007 నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్..నిత్యావసర వస్తువుల ఉత్పత్తులతో పాటు పలు బిజినెస్ ల ద్వారా డబ్బు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని భారత్, అమెరికా నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడయ్యింది. అమెరికా నిఘా వర్గాల ప్రకారంగా చూస్తే..ప్రభుత్వం జప్తు నుంచి తప్పించుకోడానికి జేషే మహ్మద్ సంస్థ బ్యాంకుల్లో నగదును జమచేయడం లేదని తేలింది. 
Read Also: సమ్మర్ కూల్ ఎలా : తెలంగాణలో బీర్లు బంద్

తెలిసినా పట్టించుకోని పాక్ గూఢాచార సంస్థలు..ఆర్మీ
ఈ పెట్టుబడుల గురించి పాక్ గూఢచారి సంస్థలకు..ఆర్మీలకు తేటతెల్లమే.కానీ భారత్ నే టార్గెట్ చేస్తు ఈ సంస్థ పనిచేయటంతో చూసీ చూడటనట్టు ఊరుకుంటున్నాయి. మతపరమైన కార్యక్రమాల పేరుతో పెద్ద మొత్తంలో విరాళాల ద్వారా నిధులను సేకరించి..వాటిని మళ్లీ పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. అల్ రహ్మత్ ట్రస్ట్, అల్ రషీద్ ట్రస్ట్‌ల ద్వారా జైషే మహ్మద్  సంస్థ నిధులను సమకూర్చుకుంటోందని ఈ అమెరికా..భారత్ ఇంటెలిజెన్స్ తెలిపాయి.
Read Also : అభినందన్ ప్రొఫైల్ : హైదరాబాద్ లోనే ట్రైనింగ్

అంతర్జాతీయ నివేదికలు ప్రకారం.. పాక్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చట్టంలో లొసుగులు, పెరుగుతోన్న నిరుద్యోగాన్ని జైషే మహ్మద్ తనకు అనుకూలంగా మలచుకుని బలాన్ని పెంచుకుంటోంది. ఈ సంస్థలో 1000 మందికి పైగా శిక్షణ పొందిన ఉగ్రవాదులతోపాటు వివిధ మదర్సాల్లో వేలాది మందిని ఉగ్రవాదంలోకి చేర్చుకుంటోంది. ఇటువంటి రిక్రూట్‌మెంట్స్ పాక్ వ్యాప్తంగా కొనసాగుతుండగా..ముఖ్యంగా దక్షిణ పంజాబ్‌లో విస్తరణపై జైషే దృష్టిసారించింది. దీంతోపాటు లష్కరే ఇ ఝంగ్వీ, లష్కరే ఇ తైబా, అల్‌ఖైదా, తాలిబాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు సైతం స్వేచ్ఛగా కర్యకలాపాలు సాగిస్తున్నాయని భారత్, అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి.
Read Also : ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే