Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్‌మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!

భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి.

Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్‌మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!

200 Bodies Found In Basement In Mariupols Ruins

Russia-Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మానలేదు. యుక్రెయిన్ కూడా రష్యాను ప్రతిఘటిస్తునే ఉంది. యుద్ధం ప్రారంభించిన సమయంలో కొన్ని వారాల పాటు సామాన్యుల వైపు దృష్టి పెట్టకుండా కేవలం యుక్రెయిన్ సైన్యంమీదనే యుద్ధం చేసింది రష్యా. కానీ పోను పోను అమాయకులను మట్టుబెట్టడం మొదలుపెట్టింది. అలా నివాసాలపై బాంబు దాడులు కొనసాగిస్తోంది. అలా రష్యా దాడులకు ప్రతిఫలంగా ఓ అపార్ట్ మెంట్ పై చేసిన దాడుల దాష్టీకం తాజాగా బయటపడిన ఓ నిజం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది.

Also read : Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని యుక్రెయిన్ అధికారులు మంగళవారం (మే 24,2022)న వెల్లడించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని..తీవ్రమైన దుర్వాసన వస్తున్నాయని మేయర్ సలహాదారు పెట్రో ఆండ్రియుష్చెంకో తెలిపారు.

రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.

Also read :Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్​ వరల్డ్‌డాన్ దావూద్‌ ఇబ్రహీం

కాగా ఈనాటికి కూడా యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండాను ఎగురవేశాయి. కాగా, యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పైకి రష్యా 1,474 సార్లు క్షిపణులు ప్రయోగించిందని, వేర్వేరు రకాలకు చెందిన 2,275 క్షిపణుల్ని ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.