ఆ జంటకు కరోనా గురించే తెలియదట!
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లోడిని కదిలించినా కూడా కరోనా గురించి చెబుతారు ఇప్పుడు. ప్రపంచాన్ని అతలాకుతలం అవుతుంది. అయితే ఒక జంటకు మాత్రం ఇప్పటివరకు అసలు కరోనా గురించే తెలియదట.జనం అంతా కరోనా వైరస్కి భయపడి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే ఆ జంట అసలు ఈ విషయమే తెలియకుండా సాగరంలో గడిపారట.
వివరాల్లోకి వెళ్తే యూకేలోని మాంచెస్టర్కి చెందిన ఎలెనా మణిశెట్టి, ర్యాన్ ఒస్బోర్న్ 2017లో తమ ఉద్యోగాలకి రిజైన్ చేసి బోట్ని కొనుక్కున్నారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తూ ఇంట్లో వాళ్లతో అప్పుడప్పుడు టచ్లోకి వెళ్తుంటారు. అయితే బ్యాడ్ న్యూస్ ఏవి తమకి చెప్పకూడదనే నిబంధన కూడా వారు పెట్టారట.
ఈ క్రమంలోనే గత నెలలో కానరీ దీవుల నుంచి కరేబియన్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా.. దీంతో అనేక దేశాలు తమ సరిహద్దులని మూసివేశాయి. కరేబీయన్ దీవులకి చేరుకున్న ఈ జంట దాని సరిహద్దు మూసి ఉందని తెలిసి షాకయ్యారు.
కరేబియన్ ద్వీపం సరిహద్దులు మూసి ఉన్నట్లు తెలుసుకున్న వీరిద్దరు తమ నౌకను గ్రెనడాకు మళ్లించారు, అక్కడ వారు చివరకు ఇంటర్నెట్ కనెక్షన్ పొందగా.. అసలు విషయం వారికి తెలిసింది.