విమానంలో మంటలు..అందరూ చనిపోతారని అనుకున్నారు..కానీ

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 11:44 AM IST
విమానంలో మంటలు..అందరూ చనిపోతారని అనుకున్నారు..కానీ

Terrifying video : మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ లో చెలరేగిన మంటలు అందర్నీ కలవరపెట్టాయి. ఆకాశంలో విమానం..రెక్కపై చెలరేగిన మంటలు..అందులో ఉన్న ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. గాలికి విపరీతంగా మంటలు వ్యాపిస్తుండడంతో ఇక తాము బతకమని అందరూ అనుకున్నారు.




కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా..ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బతుకుజీవుడా అనుకుంటూ విమానం దిగిపోయారు. ఒళ్లుగొగురుపొడిచే విధంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://10tv.in/delhi-couple-harassed-threatened-by-drunk-men-in-paschim-vihar/



Honolulu నుంచి బయలుదేరిన మిలటరీ ఛార్టర్ ఫ్లైట్ వెళుతోంది. టెక్నికల్ సమస్యల కారణంగా..విమానం రెక్కపై మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. విమానం కిటికీ లో నుంచి చెలరేగుతున్న మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. చూసే వారికే భయం కలుగుతుందంటే..విమానంలో ఉన్న వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో అనుకుంటున్నారు.