Thailand : దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష.. థాయ్ లాండ్ కోర్టు సంచలన తీర్పు

తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు.

Thailand : దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష.. థాయ్ లాండ్ కోర్టు సంచలన తీర్పు

Thailand court

Ponzi scam : థాయ్ లాండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆన్ లైన్ పోంజి స్కీం పేరుతో సోషల్ మీడియాలో మోసానికి పాల్పడిన దంపతులకు ఒక్కొక్కరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తమ దగ్గర పొదుపు చేస్తే ఎన్నో రెట్లు అదనంగా సొమ్ములు ఇస్తామని మోసగించిన దంపతులకు ఒక్కొక్కరికి థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వాంటనీ తిప్పావెత్, మేతి చిన్ఫా పాంజీ దందపతులు 2019లో పోంజి మోసానాకి తెర లేపారు.

తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో తాము ఒక జ్యూయెలరీ షాప్ ను కూడా కొనుగోలు చేశానంటూ రకరకాల నగలు ధరిస్తూ వాంటనీ ఆ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టేవారు.

Fraud Alert : ఆన్‌‌లైన్ యాప్ మోసం..రూ. 36 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ వాసి

నిజానికి తన ఆఫీస్ లోని రూమ్ నే నగల షాప్ గా భ్రమింపజేసేలా వారు నకిలీ వీడియోను తయారు చేవశారు. దీంతో 2500 మందికి పైగా వారి పథకంలో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు సేకరించి దంపతులు బిచాణా ఎత్తి వేశారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి విచారించారు. థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు వీరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

అయితే నిందితులు నేరాన్ని అంగీకరించడంతో జైలు శిక్షను 5,056 ఏళ్లకు తగ్గించారు. నిజానికి వారికి అన్ని ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ థాయ్ లాండ్ చట్టం ప్రకారం దంపతులు ఒక్కొక్కరు 20 ఏళ్లు మాత్రమే ఆ దేశం జైలులో ఉంటారని ఒక అధికారి పేర్కొన్నారు.