Mask Innovation Challenge: బంపర్ ఆఫర్.. మాస్క్ తయారు చేయండి… రూ.3 కోట్లు గెలవండి

మాస్క్ తయారు చేస్తే రూ.3కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం ఏంటని వండర్ అవుతున్నారా? నిజమే. మాస్క్ తయారు చేస్తే అంత మొత్తం ప్రైజ్ మనీగా ఇస్తారు.

Mask Innovation Challenge: బంపర్ ఆఫర్.. మాస్క్ తయారు చేయండి… రూ.3 కోట్లు గెలవండి

Mask Innovation Challenge

Mask Innovation Challenge : మాస్క్ తయారు చేస్తే రూ.3కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం ఏంటని వండర్ అవుతున్నారా? నిజమే. మాస్క్ తయారు చేస్తే అంత మొత్తం ప్రైజ్ మనీగా ఇస్తారు. ప్రస్తుత కరోనా కాలంలో మాస్కులు మస్ట్ గా మారాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే మాస్క్ ముఖ్యం. దీంతో అందరం మాస్కులు పెట్టుకుంటున్నాం. కానీ మనలో ఒక్కరికి కూడా అవి నచ్చవు. ఎందుకంటే, ప్రతీ మాస్కూ ఏదో ఒక రకమైన అసౌకర్యం కలిగిస్తూనే ఉంటుంది. అందుకే కొంతమంది మాస్కులే పెట్టుకోవట్లేదు. కొంత మంది పెట్టుకున్నా… గడ్డం కిందే ఉంటాయవి.

ఈ క్రమంలో.. సులభంగా వాడగలిగే, సౌకర్యవంతమైన మాస్కును తయారు చేస్తే రూ.3.6కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామంటున్నారు.. మాస్క్ ఇన్నోవేషన్ చాలెంజ్ సంస్థ(Mask Innovation Challenge) అధికారులు. అమెరికా ప్రభుత్వానికి చెందిన బయో మెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీతో(BARDA) కలిసి ఈ పోటీ నిర్వహిస్తుంది.

మాస్క్ ఎలా ఉండాలంటే:
ఒక్క మాటలో చెప్పాలంటే… అలాంటి మాస్క్ ధరించడానికి ప్రజలు పోటీ పడాలి. అలా ఉండాలట. అమెరికాలో వ్యాధుల నియంత్రణ సంస్థ – CDCకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NIOSH) అనే సంస్థ భాగస్వామ్యంతో BARDA… ఈ మాస్క్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు వాడుతున్న మాస్కుల వల్ల చాలా మంది ముక్కు ద్వారా వదిలే శ్వాస… కళ్లజోడుపై వాలి… స్పెట్స్ మసకగా మారుతున్నాయి. చల్లటి వాతావరణం ఉండే అమెరికన్లకు ఇదో తలనొప్పిగా మారింది. అందుకే అక్కడైతే… “మాస్క్ వాడను ఏం చేస్తారో చేసుకోండి” అనే వారూ ఉన్నారు. నో మాస్క్ ఉద్యమం కూడా అక్కడ నడుస్తోంది.

మొదటి దశ పోటీ:
ఈ కంటెస్ట్ 2 రకాలుగా ఉంటుంది. మొదటి దశలో… మాస్క్ డిజైన్‌పై దృష్టి పెడతారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడున్న మాస్కుల్లోనే మార్పులు చేసి తయారు చేయడం ఒక పద్ధతైతే… పూర్తిగా సరికొత్త టెక్నాలజీ, సరికొత్త ఉత్పత్తులతో కొత్త డిజైన్ మాస్క్ చేయడం మరో పద్ధతి. మొదటి దశలో… 10 మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఒక్కొక్కరికీ 10వేల డాలర్లు (రూ.7,33,300) ఇస్తారు. ఆ డబ్బుతో వారు తాము చెయ్యాలనుకున్న మాస్కును తయారుచేసి చూపిస్తారు.

రెండో దశ పోటీ:
రెండో దశను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటున్నారు. ఈ దశలో… 10 కంటెస్టెంట్లు… తాము చెయ్యాలనుకుంటున్న సరికొత్త మాస్కుల డిజైన్‌ను ఊహాజనితంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ మాస్కులు ఇప్పుడున్న మాస్కుల లాగా అస్సలు ఉండకూడదు. తమ ఊహాజనిత మాస్కును కంటెస్టెంట్లు తయారుచేసి… టెస్టింగ్ కోసం NIOSHకి ఇవ్వొచ్చు. వీరిలో ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేసి… వారికి అందరికీ కలిపి $400,000 (రూ.2,93,32,000) ప్రైజ్ మనీగా ఇస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని మళ్లీ త్వరలో ప్రకటిస్తామని NIOSH, BARDA తెలిపాయి.

మాస్క్ ఎలా ఉండాలంటే:
ఇంత భారీ ప్రైజ్ మనీ ఇస్తున్నారు కదా అని మరీ హై రేంజ్‌లో మాస్క్ ఉంటే కుదరదు. ఎందుకంటే… అసలు దాన్ని తయారుచేయాలన్న ఉద్దేశాన్ని అది నెరవేర్చాలి. అంటే ఆ మాస్క్ అందరూ పెట్టుకోవాలి. డబ్బున్న వారు, పేద వారూ అందరూ దాన్ని కొనుక్కోగలగాలి. అందరూ దాన్ని రోజువారీ వాడుకునేలా ఉండాలి. కరోనాను అది ఆపడమే కాదు… అది వచ్చాక… మన జీవితాల్లో మాస్క్ ధరించడం అనేది ఓ సాధారణ అంశంగా మారిపోవాలి. ప్రపంచంలో సగం మందికిపైగా వ్యాక్సిన్ వేసుకున్నా… మాస్క్ వాడేందుకు ప్రజలు ఇష్టపడాలి. ఇప్పుడున్న మాస్కులు ఇలాంటి అన్ని ప్రయోజనాలూ కల్పించలేకపోతున్నాయి. మొదటి దశ పోటీకి ఏప్రిల్ 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.