చిన్నారి కోసం చట్టం పక్కనబెట్టిన యూఏఈ

చిన్నారి కోసం చట్టం పక్కనబెట్టిన యూఏఈ

యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా హిందూ,ముస్లిం దంపతులకు జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు.. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవచ్చు. కానీ ముస్లిం మహిళ ముస్లిమేతరుడిని వివాహం చేసుకోకూడదు. 

2016లో భారత్‌ కు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్దిఖీ కేరళలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా వీరు షార్జాలో నివసిస్తున్నారు. 2018 జూలైలో వారికి అక్కడే కూతురు జన్మించింది. అనామ్తా ఏస్‌ లిన్ కిరణ్ అని ఆ పాపకు పేరుపెట్టారు.

యూఏఈ దేశ నిబంధనల ప్రకారం వారికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారుల నిరాకరించారు. కోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. వారు భారత్‌ కు వచ్చేందుకు ప్రయత్నించగా బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో పాపకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రాలేదు. దీంతో మరోసారి కిరణ్ కోర్టును ఆశ్రయించారు. కిరణ్ అభ్యర్థనను మన్నించిన కోర్టు బర్త్ సర్టిఫికెట్ జారీకి అనుమతిచ్చింది.