బ్రిటన్ ప్రధానితో మోడీ సంభాషణ

  • Published By: venkaiahnaidu ,Published On : November 27, 2020 / 10:28 PM IST
బ్రిటన్ ప్రధానితో మోడీ సంభాషణ

UK PM Johnson Speaks with Indian Counterpart Modi బ్రిటన్ ప్రధానితో శుక్రవారం(నవంబర్-27,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని కార్యాలయం)ప్రకటన విడుదల చేసింది.



బోరిస్ జాన్సన్, ప్రధాని మోడీ కలిసి కరోనా వ్యాక్సిన్​ విషయాలపై చర్చించారు. ఇరుదేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా పనిచేయడాన్ని స్వాగతించారు. వాతావరణ మార్పులకు తోడ్పడే ‘వాతావరణ ఆశయ శిఖరాగ్ర సమావేశం’లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంబంధాల బలోపేతం కోసం మరింత కృషి చేయాలని దేశాధినేతలు నిర్ణయించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.



భారత్-బ్రిటన్ సంబంధాలకు 2021 ఏడాది కీలకమని బోరిస్ పేర్కొన్నట్లు డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఈ ప్రాంతంలో హెచ్​ఎం క్వీన్ ఎలిజబెత్ క్యారియర్ బృందాన్ని మోహరించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.



కాగా,బోరిస్​ తో సంభాషణ అద్భుతంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బోరిస్​ను స్నేహితుడిగా అభివర్ణించిన మోడీ .. వచ్చే దశాబ్దంలో భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల కోసం ప్రతిష్ఠాత్మక రోడ్​ మ్యాప్​ ను బోరిస్ సిద్ధం చేశారని చెప్పారు. కరోనా పోరుతో పాటు వాతావరణ మార్పులు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని అంగీకరించుకున్నట్లు చెప్పారు.