UK : బంగారు బిస్కెట్ పై వినాయకుడు బొమ్మను విడుదల చేసిన బ్రిటన్‌ రాయల్‌ మింట్‌

ఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రిటన్‌లోని రాయల్‌ మింట్‌ 24 క్యారట్ల బంగారంతో వినాయకుడి ప్రతిమతో కూడిన బిస్కెట్‌ను విడుదల చేసింది.

UK : బంగారు బిస్కెట్ పై వినాయకుడు బొమ్మను విడుదల చేసిన బ్రిటన్‌ రాయల్‌ మింట్‌

UK Royal Mint launches gold bar for Ganesh : ఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రిటన్‌లోని రాయల్‌ మింట్‌ 24 క్యారట్ల బంగారంతో వినాయకుడి ప్రతిమతో కూడిన బిస్కెట్‌ను విడుదల చేసింది. 20 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన ఈ గోల్డ్‌ బార్‌ ధరను రూ.1,06,578గా నిర్ణయించారు అధికారులు.

2021లో దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన బిస్కెట్‌లను రాయల్‌ మింట్‌ ముద్రించింది. వేల్స్‌లోని కార్డిఫ్‌లో ఉన్న స్వామినారాయణ్‌ దేవాలయానికి చెందిన నీలేశ్‌ కబారియాతో కలిసి ఈ బిస్కెట్‌లను రూపొందించారు. వీటిని రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.