ట్రంప్ అభిశంసన ప్రక్రియకు లైన్ క్లియర్…తీర్మాణాన్ని ఆమోదించిన సభ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లదే పైచేయిగా ఉన్న ప్రతినిధుల సభలో గురువారం 232–196 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. దాదాపు డెమొక్రాట్లు అందరూ ఈ తీర్మానాన్ని సమర్థించగా… హౌస్ లోని రిపబ్లికన్లు దీనిని వ్యతిరేకించారు. అమెరికన్ చరిత్రలో గొప్ప మంత్రగత్తె వేట అంటూ ట్రంప్ తన ట్వీట్ లో తెలిపారు.
అభిశంసన విచారణను గంభీరమైన, ప్రార్థనాత్మకమైన ప్రక్రియగా తీర్మాణంపై ఓటింగ్ కు ముందు హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి అభివర్ణించారు. రిపబ్లికన్లు సత్యానికి ఎందుకు భయపడుతున్నారో తనకు తెలియదు అని పెలోసి అన్నారు. ప్రతి సభ్యుడు వాస్తవాలను విన్న అమెరికన్ ప్రజలకు మద్దతు ఇవ్వాలన్నారు. అదే ఈ ఓటు గురించి అని, నిజం గురించి అని ఆమె అన్నారు. వీటన్నిటిలో ప్రమాదంలో ఉన్నది మన ప్రజాస్వామ్యం కంటే తక్కువ కాదు అని ఆమె అన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీలో నిలవనున్నారు. ఈ సమయంలో జోసెఫ్ బైడెన్ను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడుని వొలోడిమర్ జెలెన్స్కీని ఓ ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్లో ఉన్న ఓ సంస్థలో బైడెన్ కుమారుడు హంటర్ బైడన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
అంతేకాకుండా ఉక్రెయిన్కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఆ నిధులను సెప్టంబర్ వరకూ విడుదల కాకుండా ఆలస్యం చేసింది. ఈ ఫోన్ కాల్కు దాదాపు వారం ముందు ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించినట్లు అమెరికా మీడియా తెలిపింది.
ఉక్రెయిన్కు ఇవ్వాల్సిన మిలిటరీ నిధులను ఆపేసేందుకు కూడా ఆ దేశాధినేతను ట్రంప్ హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో స్పీకర్ పెలోసి ట్రంప్ పై అభిశంసన విచారణ ప్రారంభించారు. ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపించాలని, అధ్యక్షుడిని అభిశంసించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది.
అయితే ఇప్పటివరకూ ఏ అమెరికా అధ్యక్షుడినీ అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఇద్దరు దేశాధ్యక్షులను అభిశంసించారు. 1868లో ఆండ్రూ జాన్స్, 1998లో బిల్ క్లింటన్ను అభిశంసించారు. కానీ ఆ ఇద్దరూ సేనేట్ విచారణ నుంచి తప్పించుకున్నారు. ఇక 1973లో రిచర్డ్ నిక్సన్ మాత్రం అభిశంసన అభియోగం రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.