ఒకే వేదికపై పీవీ సింధుకు, గోరటి వెంకన్నకు పురస్కారాలు

ఒకే వేదికపై పీవీ సింధుకు, గోరటి వెంకన్నకు పురస్కారాలు

వరల్డ్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధుకు మరో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందనుంది. డాక్టర్ రామినేని ఫౌండేషన్(యూఎస్ఏ) ఈ ఏడాది అందించే విశిష్ట పురస్కారాన్ని సింధుకు అందుకోనుంది. ఫౌండేషన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రదానోత్సవాన్ని అక్టోబరు 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. 

వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20ఏళ్లుగా పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. సోమవారం ఫౌండేషన్ నిర్వహకులు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాదికి గానూ ఒక విశిష్ట పురస్కారం, మూడు విశేష పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు విశిష్ట పురస్కారాన్ని, రచయిత, గాయకుడు గోరటి వెంకన్నలకు సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చంద్రశేఖర్ సంకురాత్రి, కూచిపూడి కళాకేంద్రం వ్యవస్థాపకురాలు ఏబీ బాల కొండలరావు, విశేష పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.