IPL 2020: శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి రోహిత్ కన్ఫ్యూజ్

IPL 2020: శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి రోహిత్ కన్ఫ్యూజ్

IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్దమైపోయాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. చేధనకే మొగ్గు చూపే టాస్ విన్నర్లు అనూహ్యంగా బ్యాటింగ్ వైపు ఆసక్తి కనబరచడం ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యంగా అనిపించదట.

‘నిజం చెప్పాలంటే.. నేను కన్ఫ్యూజ్ అయ్యా. టాస్ ఓడిపోయినందుకు ఇబ్బంది లేదు. అదే పెద్ద ఎఫెక్ట్ కాదు. స్టార్టింగ్ లో అగ్రెసివ్ గా బౌలింగ్ చేస్తాం. ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో.. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు’ అని రోహిత్ శర్మ అన్నాడు.

మేం ముందు బ్యాటింగ్ చేయడం మాకు చివరి మ్యాచ్ లో కూడా కలిసొచ్చింది. స్కోర్ బోర్డ్ పై మాకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది. బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా కనిపిస్తుంది. సంవత్సరాల తరబడి వారు ఛాంపియన్లు కావొచ్చు. కానీ, మేం ఓడిపోవడానికి సిద్ధంగా లేం. జట్టులో ఎటువంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.

Teams:
Mumbai Indians:
Quinton de Kock(w), Rohit Sharma(c), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Nathan Coulter-Nile, Jayant Yadav, Trent Boult, Jasprit Bumrah

Delhi Capitals: Marcus Stoinis, Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer(c), Shimron Hetmyer, Rishabh Pant(w), Axar Patel, Ravichandran Ashwin, Kagiso Rabada, Praveen Dubey, Anrich Nortje