IPL 2020: బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.., సెంటిమెంట్ వర్కౌట్ అయితే గెలవడం ఖాయం

IPL 2020: బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.., సెంటిమెంట్ వర్కౌట్ అయితే గెలవడం ఖాయం

ఐపీఎల్ లో మ‌రో ఉత్కంఠ పోరు సమయం ఆసన్నమైంది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓ వైపు 2013 నుంచి ఓపెనింగ్ మ్యాచ్‌లు ఏడింటిలో ఆరు మ్యాచ్ లు గెలిచిన కోల్‌కతా.. మరోవైపు ఈ ఏడాది అబుదాబి వేదికగా షేక్ జయాద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి.

ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో ముంబైదే పైచేయిగా కనిపిస్తుంది. వీరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబైపై గెలుపొందడం గమనార్హం.



గత ఐదు మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే 4-1 తేడాతో ముంబై కోల్‌కతాపై పైచేయిలో ఉంది. 4 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తో 2సార్లు టైటిల్ గెలిచిన కోల్‌కతా పోరాడుతుంది.