IPL 2020: గేల్ 99, రాజస్థాన్ టార్గెట్ 186
IPL 2020లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో రాజస్థాన్కు 186పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 63బంతుల్లో (6ఫోర్లు, 8సిక్సులు)99పరుగులు చేసిన గేల్ సెంచరీకి ఒక్క పరుగుదూరంలో ఔటయ్యాడు.
జోఫ్రా ఆర్చర్ వేసిన యార్కర్ కు దొరికిపోయాడు. వన్ డౌన్ లో దిగిన గేల్.. ఓపెనర్ రాహుల్(46)తో కలిసి చెలరేగాడు. నికోలస్ పూరన్(22; 10బంతుల్లో 3సిక్సులు)పరుగులు చేయగా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 4వికెట్లు నష్టాపోయిన పంజాబ్ బ్యాట్స్మెన్లో గ్లెన్ మ్యాక్స్వెల్(6), దీపక్ హుడా(1)తో క్రీజులో నిలిచారు.
IPL 2020 సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. హోరాహోరీ పోరులో.. చావోరేవే తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పంజాబ్పై టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనూహ్యంగా వరుస 5 విజయాలు అందుకొని పంజా విసురుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్లే ఆఫ్ స్థానం కోసం జరుగుతున్న మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్కు తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఓడిపోతే ప్లే ఆఫ్ పోటీ నుంచి తప్పుకున్నట్లే. మరోపక్క రాయల్స్ను చిత్తు చేసి ప్లే ఆఫ్ బెర్త్కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది పంజాబ్. ఈ సీజన్ తొలి భాగంలో ఇరు జట్ల మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Kept Gayle under 100 & KXIP under 200. ?
An all important chase awaits. ?#KXIPvRR | #HallaBol | #RoyalsFamily | #IPL2020 pic.twitter.com/u0ZiRmr0v4
— Rajasthan Royals (@rajasthanroyals) October 30, 2020