సీజన్ నుంచి బెంగళూరు ఔట్.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

సీజన్ నుంచి బెంగళూరు ఔట్.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

ipl-2021

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సీజన్ నుంచి తమ జట్టు ఎలిమినేట్ అయిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమికి గురైన తర్వాత ఎమోషనల్ మెసేజ్ చేశాడు. అబుదాబి వేదికగా తలపడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయానికి గురై తొలి సారి ట్రోఫీ దక్కించుకోవాలనే ఆశలు నీరుగార్చుకుంది.

ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆర్సీబీ లీగ్ దశ దాటి ప్లే ఆఫ్ లో నిష్క్రమించింది. ‘ఒడిదుడుకుల్లో కలిసి ప్రయాణించాం. ఒక యూనిట్ గా ఇది మనకు గ్రేట్ జర్నీ. మనం అనుకున్నట్లు పరిస్థితులు జరగకపోవచ్చు. కానీ, గ్రూపును చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నా. అభిమానులు చేసిన సపోర్ట్ కు థ్యాంక్స్. మీ ప్రేమే మమ్మల్ని శక్తిమంతం చేస్తుంది. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని #PlayBold @royalchallengersbangalore ట్యాగ్ చేస్తూ కోహ్లీ పోస్టు పెట్టాడు.




ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. పడిక్కల్ తో కలిసి ఓపెనర్ గా కోహ్లీ దిగాడు. జాసన్ హోల్డర్ రెండో ఓవర్లోనే అవుట్ చేయడంతో కోహ్లీ, తర్వాతి ఓవర్లో పడిక్కల్ అవుట్ అయ్యారు. ఆరోన్ ఫించ్, డివిలియర్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.

ఫలితంగా చేసిన 131 పరుగుల టార్గెట్ ను రైజర్స్ చేధించి టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. వార్నర్ అవుట్ టీవీ అంపైర్ డెసిషన్ తో కాంట్రవర్షియల్ గా నిలిచింది. హోల్డర్ బౌలింగ్, కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తో జట్టును నిలబెట్టారు.