IPL 2020, SRHvsRCB: కోహ్లీసేనకు కాళ్లకు బందాలేసిన సన్‌రైజర్స్

IPL 2020, SRHvsRCB: కోహ్లీసేనకు కాళ్లకు బందాలేసిన సన్‌రైజర్స్

IPL 2020: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఈ క్రమంలో 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన రైజర్స్.. టాస్‌ గెలిచి ముందుగా బెంగళూరును బ్యాటింగ్‌కు పంపింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఫిలిప్- పడిక్కల్‌లు ఆరంభించారు.

బెంగళూరుకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి పడిక్కల్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం కాస్త వ్యవధిలోనే కోహ్లి(7) కూడా వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ వేసిన మరో ఓవర్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చిన కోహ్లికి పరాభవం తప్పలేదు.



ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నంలో ఫిలిప్పె..డివిలియర్స్‌తో కలిసి పోరాడి 43 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డివిలియర్స్‌(24) కూడా అవుట్ అవడంతో ఇన్నింగ్స్ స్లో అయింది. నదీమ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో ఏబీ ఇన్నింగ్స్‌ ముగిసింది.

కాసేపటికి ఫిలెప్పి((32) కూడా ఔట్‌ కావడంతో ఆర్సీబీ 76 పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వాషింగ్టన్‌ సుందర్‌(21) పరవాలేదనిపించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కును చేరగలిగింది. క్రిస్‌ మోరిస్‌(3), ఇసురు ఉదాన(0)లను ఒకే ఓవర్‌లో హోల్డర్‌ ఔట్‌ చేయడంతో ఆర్సీబీ ఓ మోస్తారు స్కోరు చేయగలిగింది.

గుర్‌క్రీత్‌ మన్‌(15 నాటౌట్‌) కడవరకూ నిలబడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు సందీప్‌ శర్మ, హోల్డర్‌లు చెరో 2వికెట్లు సాధించగా, నటరాజన్‌, నదీమ్‌, రషీద్‌ఖాన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.