IPL 2021 : ఒక్క పరుగు.. ఢిల్లీపై బెంగళూరు విజయం

IPL 2021 : ఒక్క పరుగు.. ఢిల్లీపై బెంగళూరు విజయం

Ipl 2021 (1)

RCB VS DELHI : అవును..ఒక్క పరుగు ఎంత పని చేసింది. ఐపీఎల్ 2021 లో అదే జరిగింది. కోహ్లీ సేన టాప్ లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చివర్లో ఎబి డివిలియర్స్(75) రెచ్చిపోయాడు.

ఇక 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్(6), స్మిత్(4) పెవిలియన్ చేరారు. ఓపెనర్ పృథ్వీ షా (21) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్ నెమ్మదిగా ఆడటం ప్రారంభించాడు. మార్కస్ స్టోయినిస్(22) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హెట్మెయర్ తన హిట్టింగ్ తో మొత్తం గేమ్ నే మార్చేశాడు.

కేవలం 25 బంతుల్లో 53 పరుగులు చేసాడు. ఇక ఢిల్లీకి చివరి ఓవర్ లో 14 పరుగులు కావాల్సి ఉండగా మహ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బంతుల్లో సంధించడంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ ఐపీఎల్ లో ఐదో విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.