IPL 2021 PBKS Vs CSK : పంజాబ్‌పై చెన్నై ఈజీ విక్టరీ

ఐపీఎస్ 2021 సీజన్ 14లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌‌ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(5) మరోసారి నిరాశపర్చినా.. మరోఓపెనర్‌ డుప్లెసిస్‌(36*; 33 బంతుల్లో 3x4, 1x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మొయిన్‌ అలీ(46; 31 బంతుల్లో 7x4, 1x6) జట్టును విజయ పథంలో నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.

IPL 2021 PBKS Vs CSK : పంజాబ్‌పై చెన్నై ఈజీ విక్టరీ

Chennai Super Kings Beat Punjab Kings By 6 Wickets

IPL 2021 PBKS Vs CSK : ఐపీఎల్ 2021 సీజన్ 14లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఈజీగా చేజ్ చేసింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. చాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన సీఎస్ కే అన్ని విభాగాల్లోనూ పంజాబ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. చేజింగ్ లో చివర్లో తడబడినా విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది.

చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(5) మరోసారి నిరాశపర్చినా.. మరోఓపెనర్‌ డుప్లెసిస్‌(36*; 33 బంతుల్లో 3×4, 1×6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మొయిన్‌ అలీ(46; 31 బంతుల్లో 7×4, 1×6) జట్టును విజయ పథంలో నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.

ఈ క్రమంలోనే అలీ హాఫ్ సెంచరీకి చేరువైన వేళ మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికే చెన్నై విజయం ఖాయమైంది. అయితే, తర్వాత వచ్చిన సురేశ్‌ రైనా(8), అంబటి రాయుడు(0).. షమి వేసిన 15వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. చివరికి సామ్‌కరన్‌ (5*) క్రీజులోకి వచ్చి డుప్లెసిస్‌తో కలిసి మిగతా పని పూర్తిచేశాడు. పంజాబ్‌ బౌలర్లలో షమి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ మొదట‌ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో మునిగిన జట్టును యువ ప్లేయర్ షారుఖ్‌ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ఆదుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)తో పాటు క్రిస్‌గేల్‌(10), దీపక్‌ హుడా(10), నికోలస్‌ పూరన్‌(0) టాప్‌ ఆర్డర్‌ మొత్తం పూర్తిగా విఫలమైంది. రాహుల్‌ రనౌట్‌ కాగా, మిగతా అందర్నీ చాహర్‌ పెవిలియన్‌ పంపాడు.

ఈ నేపథ్యంలోనే క్రీజులోకి వచ్చిన షారుఖ్‌ ధాటిగా ఆడి జట్టుకు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. అతడికి మరో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. రిచర్డ్‌సన్‌(15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్‌ అశ్విన్‌(6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. చివర్లో మహ్మద్‌ షమి(9)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 14 పరుగులు జోడించాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో అర్ధశతకానికి చేరువైన వేళ భారీ షాట్‌ ఆడిన అతడు జడేజా చేతికి చిక్కాడు. చివరికి పంజాబ్.. చెన్నై ముందు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లలో సామ్‌కరన్‌, మోయిన్‌ అలీ, బ్రావో తలో వికెట్‌ పడగొట్టారు.