IPL 2021: డివిలియర్స్ ఢమాకా, ఢిల్లీ టార్గెట్ 172
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 172పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 172పరుగుల టార్గెట్ నిర్దేశించింది. మిస్టర్ 360 వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 42బంతులు ఆడిన డివిలియర్స్ 3ఫోర్లు, 5సిక్సులు కలిపి 75పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ(12), దేవదత్ పడిక్కల్(17) క్లీన్బౌల్డ్ అయ్యారు. మాక్స్వెల్(25: 20 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు), రజత్ పటిదార్(31: 22 బంతుల్లో 2సిక్సర్లు) రాణించగా.. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు.