IPL 2021 England Players : బయోబబుల్కు బై.. బై.. యూకే చేరిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఆసీస్, కివీస్ ఆటగాళ్ల ఎదురుచూపులు
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆగిపోయింది. వివిధ ఫ్రాంచైజీలలో ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్ను వదిలి స్వదేశీ బాట పట్టారు. ఒక్కొక్కరిగా ఐపీఎల్ ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
IPL 2021 England players : భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆగిపోయింది. వివిధ ఫ్రాంచైజీలలో ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్ను వదిలి స్వదేశీ బాట పట్టారు. ఒక్కొక్కరిగా ఐపీఎల్ ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోగా.. మరికొందరు అక్కడి దేశాల ఆంక్షలు, నిబంధనల ప్రకారం ప్రయాణ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
తాజా నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ యునైటెడ్ కింగ్డమ్లోని తమ ఇంటికి చేరుకున్నారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లేందుకు ఇంకా వేచి చూస్తున్నారు. ఆస్ట్రేలియన్లు ప్రస్తుతం మాల్దీవులు లేదా శ్రీలంకకు వెళ్లేందుకు ఆస్ట్రేలియాకు బోర్డు చార్టర్ విమానాలను సిద్ధం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. న్యూజిలాండ్ ఆటగాళ్ల విషయానికొస్తే.. వారంతా రెండు గ్రూపులుగా విడిపోతారు. మొదటి గ్రూప్ వచ్చే నెలలో జరిగే రెండు టెస్టుల సిరీస్కు ముందు ఇంగ్లండ్కు వెళ్లనుంది. మరొకరు స్వదేశానికి వెళతారు. కొంతమంది భారత ఆటగాళ్లు కూడా ఇంటికి చేరుకున్నారు.
11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరికొందరు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కరోనా పాటిజివ్ వచ్చిన జట్ల ఆటగాళ్లకు ప్రోటోకాల్కు సంబంధించి గందరగోళం నెలకొంది. రెండు బృందాలు క్వారంటైన్లో ఉండగా, కొంతమంది ఆటగాళ్లకు నెగటివ్ రావడంతో ఇంటికి వెళ్లేందుకు ఐపిఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మినహా మిగతా దేశాలకు చెందిన క్రికెటర్లు ఏ సమస్య లేకుండా వెళ్లిపోతున్నారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్, భారత్తో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో, ఇంగ్లండ్ టి20 బ్లాస్ట్లో పాల్గొనేందుకు కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాన్ట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్ అలెన్ ఇంగ్లండ్ వెళ్లనున్నారు. వీరంతా మే 10 వరకు భారత్లోనే ఉండాల్సి వస్తోంది.
ఆపై ఇంగ్లండ్ ప్రభుత్వం సడలించే ఆంక్షలను బట్టి బయల్దేరతారు. ఆసీస్ క్రికెటర్లు నేరుగా తమ దేశంలోనికి వెళ్లేందుకు అనుమతి లేదు. దాంతో వీరంతా మాల్దీవులకు వెళ్తున్నారు. సుమారు 40 మంది ఆస్ట్రేలియన్లు రెండు వారాలు మాల్దీవులలో గడిపనున్నారు. ఆ తర్వాతే స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తోంది.