IPL 2021: ఆటగాళ్లను అప్పు ఇవ్వండి.. తిరిగి ఇచ్చేస్తాం – రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ అప్పు కావాలి అంటూ ఇతర ఫ్రాంచైజీలను అడుగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు నుంచి నలుగురు విదేశీ ప్లేయర్లు లీగ్ ను వదిలి ...

IPL 2021: ఆటగాళ్లను అప్పు ఇవ్వండి.. తిరిగి ఇచ్చేస్తాం – రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals (1)

IPL 2021: రాజస్థాన్ రాయల్స్ అప్పు కావాలి అంటూ ఇతర ఫ్రాంచైజీలను అడుగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు నుంచి నలుగురు విదేశీ ప్లేయర్లు లీగ్ ను వదిలి వెళ్లిపోయారు. ఈ కొరతతో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఉన్న జట్టు గందరగోళంలో పడింది. 2/3వ వంతు లీగ్ మ్యాచ్ లు మిగిలి ఉండగానే దాదాపు ఆ రాయల్స్ జట్టు సంక్షోభంలో పడిపోయింది.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తమ ఫేసర్ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. అంతకంటే ఓ నాలుగు రోజుల ముందే లియామ్ లివింగ్ స్టోన్ బబుల్ ఫ్యాటిగ్ తో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఇవి చాలదన్నట్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లు గాయాలతో జట్టుకు దూరమవడం ఫ్రాంచైజీకు గట్టి దెబ్బ తగిలింది.

ఇంకా 9లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. జోస్ బట్లర్, క్రిస్ మోరిస్, డేవిడ్ మిల్లర్, ముస్తఫిజుర్ రెహ్మాన్ లు మాత్రమే జట్టుతో ఉన్నారు.

ఈ సీజన్‌లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్‌ దశ ముగిసే వరకూ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రెండు కంటే తక్కువ మ్యాచ్‌లాడిన ఆటగాణ్ని ఇతర జట్లు అరువు తీసుకోవచ్చు. అతనిపై ఉండే కండీషన్ ఏంటంటే.. సొంత జట్టుపై జరిగే మ్యాచ్‌లో మాత్రం ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్‌లో 5 మ్యాచ్‌లాడిన రాజస్థాన్‌ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది.