IPL 2021 DC VS PBKS : మంచు ముంచిందా? భారీ స్కోర్ చేసినా పంజాబ్ ఓడిపోవడానికి కారణం అదేనా
ఐపీఎల్ 2021 సీజన్ 14 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. కొన్ని మ్యాచులు థ్రిల్లింగ్ గా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంజాయ్ మెంట్ ఇస్తున్నాయి. కాగా, కొన్ని మ్యాచుల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ప్రత్యర్థి లో స్కోర్ చేసినా చేజ్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నాయి. ఒక్కోసారి భారీ స్కోర్ చేసినా ఓటమి తప్పడం లేదు. ఇందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ నిదర్శనం.
KL Rahul Rued Dew Factor : ఐపీఎల్ 2021 సీజన్ 14 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. కొన్ని మ్యాచులు థ్రిల్లింగ్ గా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంజాయ్ మెంట్ ఇస్తున్నాయి. కాగా, కొన్ని మ్యాచుల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ప్రత్యర్థి లో స్కోర్ చేసినా చేజ్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నాయి. ఒక్కోసారి భారీ స్కోర్ చేసినా ఓటమి తప్పడం లేదు. ఇందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ నిదర్శనం.
పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ కేపిటల్స్ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. కాగా, మంచు తమ కొంపముంచిందని, తమ ఓటమికి కారణమదే అని పంజాబ్ జట్టు క్రికెటర్లు వాపోయారు. మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఛేదన సమయంలో బౌలింగ్ చేసే జట్టు బంతిని మార్చుకునే వెసులుబాటు ఉంటే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలోనే ఈజీగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 49 బంతుల్లోనే 92 పరుగులు చేసి శివమెత్తడంతో.. మయాంక్ (69), రాహుల్ (61) శ్రమ వృథా అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత ఇరు జట్లూ అభిప్రాయాలు పంచుకున్నాయి.
కొత్తగా ప్రయత్నించడానికి భయపడను.. శిఖర్ ధావన్
చాలా రోజులుగా నా ఆట తీరు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా. ధాటిగా ఆడేందుకు వెనుకంజ వేయడం లేదు. కొత్తగా ప్రయత్నించడానికి భయపడను. నెట్స్లో ఎంత బాగా సాధన చేస్తానో.. మ్యాచుల్లోనూ అదే ఆట తీరు అమలు చేసేందుకు ప్రయత్నిస్తా. కొద్ది రోజులుగా లెగ్సైడ్ షాట్స్ ఆడటం సాధన చేస్తున్నా. బౌలర్ల వేగాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటూ ఆడేందుకు ప్రణాళిక వేస్తున్నా. ఒక్కో బౌలర్కు ఎలా ఆడాలో ముందుగానే ఆలోచించుకుంటాను. దాన్నే అమలు చేస్తున్నా. ఇటీవల నా స్లాగ్ షాట్ బాగా మెరుగుపడింది. అందుకు ఆనందంగా ఉంది. పృథ్వీ షాతో ఓపెనింగ్ ఆస్వాదిస్తున్నా. ఈ మ్యాచ్ నెగ్గడం మరింత ఉత్సాహాన్నిస్తోంది.
కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా.. రిషభ్ పంత్
ఢిల్లీ జట్టుకు కెపెన్ట్ గా నాకెంతో సంతోషంగా ఉంది. ఆరంభంలో మాపై బాగా ఒత్తిడి ఉంది. పిచ్ అంతగా సహకరించ లేదు. మా బౌలర్లు పంజాబ్ను 190 పరుగులకే కట్టడి చేయడం మంచి ప్రదర్శన. ఛేజింగ్ లో శిఖర్ మాకు పూర్తి ఆధిపత్యం వచ్చేలా ఆడాడు. జట్టు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలనే కోరుకుంటాను. అలాగే ఆటలోనూ చక్కగా రాణించాలని ఆశిస్తాను.
భారీ స్కోరును ఆపాం.. స్టోయినిస్
పది ఓవర్లు అయ్యేసరికి ఈ మ్యాచ్లో రాహుల్ సేన 250 పరుగులు చేస్తుందేమో అనుకున్నా. కానీ బాగా ఆపగలిగాం. మాలో ధావన్ అద్భుతంగా ఆడాడు. గతేడాది ఫాంనే కొనసాగిస్తున్నాడు. అతని పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో ప్రతి మ్యాచూ ఫైనల్లాగే ఉంటుంది. మరింత మంచి ప్రదర్శన చేయాలి.
మంచు కొంపముంచింది.. కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్ ఓడిపోవడం కాస్తంత నిరాశగా ఉంది. అయితే మా ఆట తీరు మాత్రం బాగుంది. ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. మంచి ఆటతీరు కనబరుస్తాం. మా స్కోరులో ఓ 15 పరుగులు తక్కువయ్యాయి. అయినా 196 మంచి టార్గెట్ అనే భావిస్తున్నా. ధావన్ తన ఆటతో విజయాన్ని ఢిల్లీ వైపు తీసుకెళ్లాడు. వాంఖడేలో మంచు కూడా మాకు ప్రతికూలంగా మారింది. ఛేదనలో మంచు ప్రభావానికి ఏమీ చేయలేకపోతున్నాం. ప్రణాళికల్లో మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఛేదన సమయంలో బౌలింగ్ చేసే జట్టు బంతిని మార్చుకునే వెసులుబాటు ఉంటే బావుంటుంది.